స్వచ్ఛసేవలో ‘మహానుభావుడు’
- శర్వానంద్, మెహరీన్ జంటగా తెరకెక్కిన చిత్రం మహానుభావుడు
- బాహుబలి ప్రభాస్ ఛాలెంజ్ స్వీకరించిన శర్వానంద్
- స్వచ్ఛభారత్ లో పాల్గొన్న శర్వానంద్
యువహీరో శర్వానంద్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహానుభావుడు’. దసరా పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో శర్వానంద్ అతిశుభ్రత అనే లక్షణంతో బాధపడుతుంటాడు. చిన్న మరక కనిపించినా.. శుభ్రం చేసేదాక ఊరుకూడు. ఈ విషయం సినిమా చూసిన అందరికీ తెలిసిందే.
ఆ మహానుభావుడు ఇప్పుడు నిజంగానే చీపురు పట్టుకొని రోడ్లు ఊడ్చేశాడు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా ప్రధాని నరేంద్రమోదీ బాహుబలి ప్రభాస్ ని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాస్ స్వచ్ఛభారత్ ఛాలెంజ్ ని శర్వానంద్ కి ఇచ్చారు. ప్రభాస్ చాలెంజ్ స్వీకరించిన మహానుభావుడు ఈ రోజు చీపురుపట్టారు.
హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, దర్శకుడు మారుతితో కలిసి రహదారులు, పార్కును వూడ్చి శుభ్రం చేశారు.ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ.. ‘మహానుభావుడు’ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. పరిసరాల పరిశుభ్రత కోసం మోదీ ప్రారంభించిన స్వచ్ఛభారత్లో అందరూ పాల్గొనాలని కోరారు.