పవన్ తో పోటీపడుతున్న శర్వానంద్
- బడా హీరోలకు పోటీగా ఇప్పటికే రెండుసార్లు బరిలో దిగాడు శర్వానంద్
- ఈసారి ఏకంగా పవన్ కల్యాణ్ కు పోటీగా దిగేందుకు శర్వానంద్ రెడీ అవుతున్నాడు
- పవన్ కాటమరాయుడు రిలీజ్ అయ్యిన నాలగురోజుల్లోనే విడుదల కానున్న రాధ మూవీ
.దీనికి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ అయితే ఇంకా రాలేదు కానీ, మార్చి 29వ తేదీపై మాత్రం శర్వానంద్ గట్టిగానే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.ఈ సంక్రాంతికి శతమానంభవతి సినిమాతో థియేటర్లలోకొచ్చాడు శర్వానంద్. ఓవైపు చిరంజీవి, మరోవైపు బాలకృష్ణ లాంటి ఇద్దరు పెద్ద స్టార్లు పోటీలో ఉన్నప్పటికీ తన సినిమాను రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్నాడు.
అంతకుముందు సంక్రాంతికి కూడా ఇలానే జరిగింది. ఎన్టీఆర్, నాగార్జున, బాలకృష్ణ లాంటి స్టార్స్ బరిలో ఉన్నప్పటికీ... ఎక్స్ ప్రెస్ రాజా సినిమాతో హిట్ కొట్టాడు. సో, తన గత సినిమాల బాటలోనే రాధ కూడా హిట్ అవుతుందనే నమ్మకంతో, కాటమరాయుడికి పోటీగా రిలీజ్ చేస్తున్నాడు.
పవన్ కల్యాణ్ సినిమాకు పోటీగా తను కూడా రంగంలోకి దూకడానికి మరో కారణం కూడా ఉంది. ప్రస్తుతం శర్వానంద్ కు దారిలేదు. ఈనెల 29 మిస్ అయితే, ఏప్రిల్ నెలంతా అతడు తన సినిమాను విడుదల చేయలేడు. మిస్టర్, చెలియా, బాహుబలి-2, గురు.. ఇలా చాలా సినిమాలతో ఏప్రిల్ బాక్సాఫీస్ ఇప్పటికే ప్యాక్ అయిపోయింది. అందుకే కొంచెం రిస్క్ అయినా మార్చి 29కే వచ్చేయాలని అనుకుంటున్నాడు శర్వ.