Asianet News TeluguAsianet News Telugu

స్టార్ కమెడియన్ తో శంకర్ కి సయోధ్య కుదిరిందా!

హింసై  అరసన్‌ 23 ఆమ్‌ పులికేసి చిత్రం ద్వారా హాస్య నటుడు వడివేలును హీరోగా పరిచయం చేశాడు. తెలుగులో హింసించే యువరాజు 23వ పూలకేసిగా ఈ చిత్రం విడుదల అయ్యింది. ఈ  చిత్రం హిట్ కావడంతో, వడివేలుతో సీక్వెల్ నిర్మించాలని దర్శకుడు శంకర్‌ భావించారు.

 

Shankar and vadivelu got compromised says media ksr
Author
Hyderabad, First Published Jun 18, 2021, 4:00 PM IST

చాలా కాలంగా దర్శకుడు శంకర్‌ కమెడియన్ వడివేలు  మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వీరు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు, ఫిర్యాదు చేసుకున్నారు. హింసై  అరసన్‌ 23 ఆమ్‌ పులికేసి చిత్రం ద్వారా హాస్య నటుడు వడివేలును హీరోగా పరిచయం చేశాడు. తెలుగులో హింసించే యువరాజు 23వ పూలకేసిగా ఈ చిత్రం విడుదల అయ్యింది. ఈ  చిత్రం హిట్ కావడంతో, వడివేలుతో సీక్వెల్ నిర్మించాలని దర్శకుడు శంకర్‌ భావించారు.

షూటింగ్‌ కొంత భాగం పూర్తయిన తర్వాత కథలో మార్పులు చేశారంటూ నటుడు వడివేలు షూటింగ్‌లో పాల్గొనడానికి నిరాకరించారు. దీంతో దర్శకుడు శంకర్‌కు వడివేలుకు మధ్య తలెత్తిన విభేదాలు నిర్మాతల మండలిలో ఫిర్యాదు వరకు వెళ్లాయి. వడివేలు కారణంగా తనకు రూ.2 కోట్లు నష్టం వాటిల్లిందని శంకర్‌ ఫిర్యాదు చేశారు. ఆ తరువాత వడివేలు నటనకు దూరమయ్యారు.

పలుమార్లు దర్శకుడు శంకర్, వడివేలు మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి నిర్మాతల మండలి ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదు. తాజాగా వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ సంస్థ అధినేత ఐసరి గణేష్‌ జరిపిన చర్చల వల్ల వీరి మధ్య సయోధ్య కుదిరిందని సమాచారం. దర్శకుడు శంకర్‌కు నష్టపరిహారం చెల్లించడానికి నటుడు వడివేలు సమ్మతించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

Follow Us:
Download App:
  • android
  • ios