హాస్పటిల్ లో అజిత్ భార్య షాలిని, ఏమైందంటే...
అజిత్ ఆసుపత్రికి వెళ్లడానికి కారణం అతడి భార్య హీరోయిన్ షాలిని. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో షాలినిని కలిసారు.
హడావిడిగా తన చిత్రం షూటింగ్ నుంచి చెన్నైకి తిరిగి వచ్చారు అజిత్. చెన్నై ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అజిత్ ఆసుపత్రికి వెళ్లడానికి కారణం అతడి భార్య హీరోయిన్ షాలిని. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో షాలినిని కలిసారు. అక్కడ ఆసుపత్రి బెడ్ పై ఉన్న షాలిని చేతులు పట్టుకుని ఉన్న అజిత్ ఫోటో సోషల్ మీడియాలో షేర్ అయ్యింది. ఇనిస్ట్రాలో ఈ ఫొటోని షాలిని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ వైరలవుతుండగా.. షాలిని త్వరగా కోలుకోవాలని.. బ్యూటీఫుల్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే షాలిని కు ఏమి జరిగింది..ఎందుకు హాస్పటిల్ లో ఉందనే వివరణ మాత్రం లేదు.
అయితే చెన్నై మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆమెకు చిన్న సర్జరీ జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా బాగానే ఉంది. అజిత్ షూటింగ్ లో బిజీగా ఉండడంతో షాలిని సర్జరీ సమయంలో ఆమెతోపాటు ఉండలేకపోయాడు. కొత్త సినిమా కోసం అజర్ బైజాన్ వెళ్లాల్సి రావడంతో తన భార్య సర్జరీకి అవసరమైన పనులు పూర్తి చేసి.. అందుకు సంబంధించిన వైద్యులతో మాట్లాడి విదేశాలకు వెళ్లారట.
షూటింగ్ వాయిదా వేస్తే నిర్మాతకు ఆర్థికంగా నష్టం కలుగుతుందని.. అందుకే తన భార్యకు సర్జరీ చేయాల్సి వచ్చినా షూటింగ్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకే సర్జరీ అయ్యిన తర్వాత తన భార్యను చూసేందుకే అజిత్ అజర్ షూటింగ్ నుంచి చెన్నై వచ్చారని, షాలిని కోలుకున్న తర్వాతే అజిత్ కంటిన్యూ షెడ్యూల్ లో అజర్ బైజాన్ లో డిలిజెన్స్ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం.
తమిళ సూపర్ స్టార్అజిత్ ప్రస్తుతం విడాముయర్చి చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రావటానికి రెడీ అవుతున్నారు. ఈ మూవీ షూటింగ్లో ఆయన బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను లైకా ప్రోడక్షన్స్పై మగిళ్ తిరుమేని దర్శకత్వంలో సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. రీసెంట్ గా అజిత్ ఫస్ట్ లుక్ని విడుదల చేశారు.