షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాపై.. ఢిల్లీ హైకోర్ట్ కీలక ఆదేశాలు
షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాకు సబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ హైకోర్ట్. ఈసినిమా విషయంలో స్వయంగా షారుఖ్ ఖాన్ కోర్టు ను ఆశ్రయించారు. అసలు ఏ విషయంలో షారుఖ్ కోర్టును ఆశ్రయించారంటే..?
![Shahrukh Khan Jawan Movie leakage problems Problems JMS Shahrukh Khan Jawan Movie leakage problems Problems JMS](https://static-ai.asianetnews.com/images/01gyxrg0jvcmc014ba3w0t85se/whatsapp-image-2023-04-26-at-08-21-13_363x203xt.jpg)
పఠాన్ సినిమాతో మంచి జోష్ వచ్చింది షారుఖ్ ఖాన్ కు. ఆరుపదుల వయస్సులో కూడా కుర్ర హీరోలను మించి హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు బాలీవుడ్ బాద్ షా. జీరో మూవీ డిజాస్టర్ తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాడు షారుఖ్. ఈలోపు కెరీర్ పరంగా.. పర్సనల్ గా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇక కమ్ బ్యాక్ ఇవ్వడంతోనే.. భారీ బ్లాక్ బస్టర్ తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. పఠాన్ మూవీ ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. కోలుకోలేని దెబ్బతిని ఉన్న బాలీవుడ్ కు పఠాన్ ఊపిరిపోసింది. దాదాపు 1000 కోట్ల కలెక్షన్ మార్క్ దాటి బాక్సాఫీస్ ను షేక్ చేసింది.
ఇక పటాన్ జోష్ తో తన నెక్ట్స్ సినిమాపై కూడా అంతే జోరు చూపిస్తున్నాడు షారుఖ్. ఈసారి సౌత్ వాసనలు తగిలేలా జవాన్ సినిమా చేస్తున్నాడు. తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో.. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ సేతుపతి షారుఖ్ ఖాన్ తో విలన్ గా తలపడనున్నాడు. అయితే ఈమూవీకి సంబధించి షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుంది. ఈక్రమంలో ఈ మూవీ నుంచి రెండు కీలక సన్నీవేశాల వీడియో లు లీక్ అయినట్టు తెలుస్తోంది. ఇవి సినిమాకు చాలా ఇంపార్టెంట్ అవ్వడంతో.. షారుఖ్ వెంటనే ఢిల్లీ హైకోర్ట్ ను ఆశ్రయించాడు.
అయితే ఈ వీడియోలో లీక్ అయిన సీన్స్ చాలా ఇంపార్టెంట్.. సినిమాను మలుపు తిప్పే సన్నివేశాలు కావడంతో.. షారుఖ్ వెంటనే ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించాడు. ఆ వీడియో క్లిప్స్ ని సోషల్ నెట్ వర్క్స్ నుంచి తొలిగించాలి అంటూ కోర్ట్ లో పిటీషన్ వేశాడు. షారుఖ్ ఖాన్ పిటిషన్ ని విచారించిన కోర్ట్.. ఆ వీడియో క్లిప్స్ ని సోషల్ నెట్ వర్క్స్ నుంచి వెంటనే తొలిగించాలి అంటూ సైబర్ పోలీస్ లను ఆదేశించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలిగించారు. దాంతో మూవీ టీమ్ కాస్త ఊపిరి పీల్చుకుంది.
ఈసినిమాపై క్రేజ్ అంతకంతకు పెరుగుతుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో బాలీవుడ్ బాద్ షా రెండు పాత్రల్లో అలరించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రియమణి, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా దీపికా పడుకోణె, సంజయ్ దత్, విజయ్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ గెస్ట్ పాత్రల్లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గానే అల్లు అర్జున్ కి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. సౌత్ యంగ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాను జూన్ 2న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు టీమ్.