Asianet News TeluguAsianet News Telugu

నా పారితోషికం కట్ చేసుకోండి.. సినిమా ఓటిటికి మాత్రం వద్దు, స్టార్ హీరో కామెంట్స్

బాలీవుడ్ క్రేజీ హీరో షాహిద్ కపూర్ తెలుగు సినిమాలని బాగా ఫాలో అవుతున్నాడు. తెలుగులో ఘనవిజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని షాహిద్ కబీర్ సింగ్ గా హిందీలో రీమేక్ చేశాడు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది.

Shahid Kapoor asks makers not to release Jersey on OTT
Author
Hyderabad, First Published Dec 31, 2021, 5:15 AM IST

బాలీవుడ్ క్రేజీ హీరో షాహిద్ కపూర్ తెలుగు సినిమాలని బాగా ఫాలో అవుతున్నాడు. తెలుగులో ఘనవిజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని షాహిద్ కబీర్ సింగ్ గా హిందీలో రీమేక్ చేశాడు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. నాని నటించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా జెర్సీ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. 

ఈ చిత్రం చూసిన వెంటనే రీమేక్ చేయాలనీ డిసైడ్ అయినట్లు  షాహిద్ కపూర్ గతంలో తెలిపాడు. తెలుగు వర్షన్ తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనే హిందీ రీమేక్ రూపొందింది. షాహిద్ కి జోడిగా ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. 

హిందీ రీమేక్ ని దిల్ రాజు, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ శుక్రవారం డిసెంబర్ 31న ఈ చిత్రం విడుదల కావాల్సింది. కానీ ప్రస్తుతం ఢిల్లీ, మహారాష్ట్ర లలో కోవిడ్ కేసులు అంతకంతకు పెరుగుతుండడంతో ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. దీనితో మేకర్స్ ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. 2022లో సరైన టైం చూసుకుని విడుదల చేస్తామని తెలిపారు. 

అయితే ఈ చిత్రాన్ని ఓటిటిలో రిలీజ్ చేసే అంశంపై కూడా నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనితో ఈ అంశంపై షాహిద్ కపూర్ స్పందించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి షాహిద్ కపూర్ 31 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాడు. అవసరమైతే తన రెమ్యునరేషన్ కట్ చేసుకోవాలని నిర్మాతకు సూచించాడట. అంతే కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని ఓటిటిలో రిలీజ్ చేయవద్దని షాహిద్ నిర్మాతలని కోరినట్లు తెలుస్తోంది. 

షాహిద్ తీసుకున్న నిర్ణయం అభినందించదగ్గదే అని అభిమానులు అంటున్నారు. తన సినిమా థియేటర్స్ లో రిలీజ్ కావడం కోసం రెమ్యునరేషన్ కూడా వదులుకోవడానికి సిద్ధం అయ్యాడు అని ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Also Read: ఘాటు లిప్ కిస్సులతో రెచ్చిపోయిన శ్రీయ.. వీళ్ళ రొమాన్స్ కి హద్దే లేదా, ఫోటోస్ వైరల్!

Follow Us:
Download App:
  • android
  • ios