Asianet News TeluguAsianet News Telugu

కరోనా నుంచి కోలుకుని పక్షవాతానికి గురైన షారూఖ్‌ నటి శిఖా మల్హోత్రా

షారూఖ్‌ ఖాన్‌ నటించిన `ఫ్యాన్‌` సినిమాలో కీలక పాత్రలో నటించింది నటి శిఖా మల్హోత్రా. ఆమె ఇటీవల కరోనాకు గురైంది. కరోనా రోగులకు సేవలందిస్తూ వైరస్‌ బారిన పడ్డారు. ఎట్టకేలకు దాన్నుంచి కోలుకున్నారు. మహమ్మారితో పోరాడి ఇటీవల ఇంటికి చేరుకున్న ఆమెని మరో రోగం వెంటాడింది. 

shah rukh khan starrer fan movie actress shikha in paralized  arj
Author
Hyderabad, First Published Dec 15, 2020, 11:36 AM IST

షారూఖ్‌ ఖాన్‌ నటించిన `ఫ్యాన్‌` సినిమాలో కీలక పాత్రలో నటించింది నటి శిఖా మల్హోత్రా. ఆమె ఇటీవల కరోనాకు గురైంది. కరోనా రోగులకు సేవలందిస్తూ వైరస్‌ బారిన పడ్డారు. ఎట్టకేలకు దాన్నుంచి కోలుకున్నారు. మహమ్మారితో పోరాడి ఇటీవల ఇంటికి చేరుకున్న ఆమెని మరో రోగం వెంటాడింది. ఆమె పక్షవాతానికి గురైంది. ఈ విషయాన్ని ఆమె మేనేజన్‌ అశ్విన్‌ శుక్లా వెల్లడించారు. 

`శిఖా పక్షపాతానికి గురయ్యారు. ఆమెకి కుడివైపు స్ట్రోక్‌ వచ్చింది. ప్రస్తుతం శిఖా.. కూపర్‌ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నార`ని తెలిపాడు. ఈ మేరకు ఆమె ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న ఫోటోని పంచుకున్నారు. దీంతో ఆమె అభిమానులు షాక్‌కి గురయ్యారు. ఆమె త్వరగా కోలుకుని తిరిగి పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే శిఖా నటిగానే కాదు, వైద్య విద్యార్థినిగా ఉంది. తనకిష్టమైన సినీ రంగంలో రాణించాలని తాపత్రయపడుతుంది. నర్సుగా ఆమె కరోనా రోగులకు సేవలందిస్తున్న క్రమంలో కరోనాకి గురైన విషయం తెలిసిందే. దాన్నుంచి కోలుకుని ఇప్పుడు పక్షవాతానికి గురికావడం బాధాకరం. ఆమె షారూఖ్‌ నటించిన `ఫ్యాన్‌` చిత్రంలో కీలక పాత్ర పోషించి అందరికి ఆకట్టుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios