Asianet News TeluguAsianet News Telugu

నరేష్ నిత్య పెళ్ళికొడుకు.. వైరల్ అవుతున్న రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమధ్య పవిత్ర లోకేష్ విషయంలో.... ఇంకా పాపులర్ అయ్యారు నరేష్. ఇక ఈక్రమంలో నరేష్ పై సీనయిర్ నటుడు.. రాజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సరదాగా అన్నా.. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Senior Actor Rajendra Prasad Sensational Comments On Naresh JMS
Author
First Published Mar 23, 2023, 8:00 PM IST

సంతోష్ శోభన్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా అన్ని  మంచి శకునములే. నందినీ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అంతే కాదు ఈమూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈక్రమంలో  రీసెంట్ గా అన్నీ మంచి శకునములే సినిమా నుంచి  టైటిల్ సాంగ్ లాంచ్ ప్రోగ్రామ్ నిర్వహించారు మూవీ టీమ్. అయితే ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ అంతా పార్టీస్పేట్ చేయగా... ప్రమోషన్ ఈవెంట్ అంతా కళకళలాడిపోయింది.ఈ సందర్భంగా సీనియర్ నటుడు నరేష్ పై రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇక  ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సీనియర్ నటుడు నరేష్‌పై  కాస్త ఫన్నీగా చమక్కులు విసిరారు.. సరదా కామెంట్లు చేశారు. అటు నరేష్ నరేష్ కూడా  రాజేంద్ర ప్రసాద్ వ్యాక్యలను సీరియస్‌గా తీసుకోలేదు. కాకపోతే సోషల్ మీడియాలోనే రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు  వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ రాజేంద్ర ప్రసాదే ఏమన్నారంటే..సినిమా గురించి మాట్లూడుతూ..మాట్లాడుతూ..సడెన్ గా నరేష్ ను నిత్య పెళ్ళి కొడుకు అనేశారు.  అంతే కాదు అన్నీ మంచి శకునములే సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమా రెండు ఫ్యామిలీ మధ్య జరిగే కథ అన్నారు. ఇక రాజేంద్ర ప్రసాద్ - నరేష్ గురించి ప్రశ్నిస్తూ.. రెండు కత్తులు ఓ వరలో ఇమడవు కదా అని అడిగారు. అయితే దానికి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ... తాను కత్తిని కాదని, నరేష్ కత్తేనని అన్నారు. తాను వర అంటూ కామెంట్స్ చేశారు రాజేంద్ర ప్రసాద్. 

ఇక నరేష్ ను ఉద్దేశించి మాట్లాడుతూ... ఆడు  మామూలు కత్తి కాదు.. ఆ విషయం మీ అందరికి తెలుసు బాగా కత్తి వాడు అంటూ.. వాడి రేంజ్ కత్తి మేము వాడం అంటూ సరదాగా ఆటపట్టించారు. నరేష్ తన తమ్ముడు అంటూ అనంతరం అతడిని దగ్గరికి పిలిచి.. చూశారా పెళ్లి కొడుకులా ఉన్నాడు కదా.. అని అన్నారు. పెళ్లికొడుకు ఏంటీ నేను నిత్యం పెళ్లికొడుకే’గా ఉంటాను అన్నారు నరేష్. ఆ సమయంలో అవునారా నేను చెప్పడం మర్చిపోయా నువ్వు నిత్య పెళ్లికొడుకువు రా అంటూ రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. దాంతో అక్కడ ఉన్న అందరూ పెద్దగా నవ్వేశారు. 

ఇక మంచి హిట్ కోసం చూస్తున్నాడు సంతోష్ శోభన్. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఇండస్ట్రీలో నిలబడలేక పోతున్నాడు. ఆప్రయత్నంలోనే సంతోష్ శోభన్  నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందించిన  సినిమా అన్నీ మంచి శకునములే. ఈ సినిమాతో ఫైట్ కు రెడీ అయ్యాడు యంగ్ హీరో. ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రమోషన్లలో పాల్గొంటోంది మూవీ టీమ్.  ఇక ఈ ఈవెంట్ లో సీనియర్ నటులు నరేష్, రాజేంద్ర ప్రసాద్, దర్శకురాలు నందినీ రెడ్డి, హీరో హీరోయిన్లు సంతోష్ శోభన్, మాళవిక నాయర్, గౌతమి, వాసుకి తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా ఇష్టంగా చేశామని, అందరికీ ఈ సినిమా నచ్చుతుందని నందినీ రెడ్డి అన్నారు. అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులను ఉగాది షడ్రుచులతో పోలుస్తూ వేదికపైకి పిలిచారు నందినీ రెడ్డి.


 

Follow Us:
Download App:
  • android
  • ios