Asianet News TeluguAsianet News Telugu

‘వీరసింహారెడ్డి’ నుంచి సెకండ్ సింగిల్.. ‘సుగుణ సుందరి’ అంటూ దుమ్ములేపబోతున్న బాలయ్య.. పోస్టర్ అదిరిందిగా!

మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్  ‘వీరసింహారెడ్డి’ నుంచి క్రేజీ అప్డేట్ అందింది. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నఈ చిత్రం  నుంచి రొమాంటిక్ సాంగ్ ను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. దీనిపై అఫిషీయల్ అప్డేట్ అందించారు. 
 

Second single from Veera Simha Reddy, The poster is amazing!
Author
First Published Dec 11, 2022, 5:15 PM IST

నందమూరి నటసింహం, సీనియర్ హీరో బాలకృష్ణ (Balakrishna) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దుమ్ములేపుతున్నారు. పౌరాణికం, యాక్షన్ ఫిల్మ్స్ తో అదరగొడుతున్న బాలయ్య.. రీసెంట్ గా ‘అఖండ’తో భారీ సక్సెస్ అందుకున్నారు.  ఆ వెంటనే గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy)లో  నటిస్తున్న విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల  ముందుకు రానున్న చిత్రం నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందుతున్నాయి.  ఇప్పటికే ‘వీరసింహా రెడ్డి’ నుంచి ‘జై బాలయ్య’ సాంగ్ విడుదలై దుమ్ములేపిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం సెకండ్ సింగిల్ ను కూడా విడుదలకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్.  దీనిపై తాజాగా అధికారికంగా ప్రకటన చేశారు. 

ఫస్ట్ సింగిల్ ను అభిమానులకు ఇష్టమైన ‘జై బాలయ్య’ టైటిల్ పై వదలగా.. సెకండ్ సింగిల్ గా రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ‘సుగుణ సుందరి’ (Suguna Sundari) టైటిల్ తో రెండో పాటను విడుదలకు సిద్దం చేస్తున్నారు. డిసెంబర్ 15న విడుదల చేయనున్నట్టు అఫీషియల్ అనౌన్స్ మెంట్ అందించారు.  అప్డేట్ అందిస్తూ అదిరిపోయే పోస్టర్ ను విడుదల చేశారు. శృతి హాసన్, బాలయ్య లవ్లీ స్టిల్ తో కూడిన పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ ను బట్టి బాలయ్య, శృతి కెమిస్ట్రీ ఎంత బాగా వర్కౌట్ అవుతోందో అర్థం అవుతోంది. 

సక్సెస్ డైరెక్షన్ లో పయనిస్తున్న యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మాలినేని (Gopichand), బాలయ్య కాంబినేషన్లో ఈ చిత్రం వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు, ఫస్ట్ సింగిల్ ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిన  విషయం తెలిసిందే. ఆల్మోస్ట్ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ను షురూ చేసింది.  చిత్రంలో గ్లామర్ బ్యూటీ శృతి హాసన్ (Shruti Haasan) ఆడిపాడుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారు. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా  వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios