Asianet News TeluguAsianet News Telugu

మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. స్పెషల్ షోస్ కు పర్మిషన్

సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ చిత్రం రేపు గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సందర్భంగా స్పెషల్ షోలకు అనుమతినిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 
 

Sarkaru Vaari Paata Telangana Government Good News, Permission for Special Shows
Author
Hyderabad, First Published May 11, 2022, 8:26 PM IST

దర్శకుడు పరుశురాం పెట్ల డైరెక్షన్ లో వస్తున్న యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం ఫస్ట్ లో మామూలుగా సినిమాగానే వచ్చినా.. ట్రైలర్ రిలీజ్ తర్వాత సీన్ మారింది. ఒక్కసారిగా ప్రేక్షకుల అటెన్షన్ ను డ్రా చేసింది. ట్రైలర్ లో పోకిరి తరహాలో టేకింగ్ ఉండటంతో   మహేశ్ బాబు ఫ్యాన్స్, ఆడియెన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది.

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో కొన్ని థియేటర్లలో స్పెషల్ షోలకు ప్రత్యేకంగా అనుమతినిస్తూ జీవో జారీ చేసింది. నైజాంలో సర్కారు వారి పాట చిత్ర రైట్ హోల్డర్స్ శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ వారి రిక్వెస్ట్ మేరకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. ఈనెల 12 నుంచి 18 వరకు వారం రోజుల పాటు ప్రతి రోజూ ఐదు షోలకు అనుమతినిచ్చింది. అలాగే స్పెషల్ షోలకు కూడా ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే ఈ షోలకు కేవలం నగరంలోని నాలుగు థియేటర్లలకే అనుమతి లభించింది.

రేపు ఒక్క రోజు మాత్రమే ఈ స్పెషల్ షోకు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్, మల్లికార్జున థియేటర్, విశ్వనాథ్ థియేటర్.. అలాగే మూసాపేటలోని శ్రీ రాములు థియేటర్ లో ఈ స్పెషల్ షో స్క్రీనింగ్ కానుంది. దీంతో మహేశ్ బాబు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) నటించారు. సముద్రఖని విలన్  రోల్ ను పోషించారు. థమన్ మ్యూజిక్ అందించగా.. జీఎంబీ ఎంటర్ టైనర్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంస్థలు నిర్మించాయి. మే 12న చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios