సంజయ్ దత్ రెమ్యునరేషన్ అంతా?, హీరోలను మించి పోతున్నాడే
తెలుగు సినిమాల్లో సంజయ్ దత్ లాంటి బాలీవుడ్ స్టార్ కనిపించడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
కేజీఎఫ్ చాప్టర్ 2 , ‘లియో’ తర్వాత సంజయ్ దత్ మార్కెట్ ఒక్కసారిగా రెట్టింపు అయ్యిందన్న సంగతి తెలిసిందే. వరసపెట్టి సౌత్ ఇండస్ట్రీ నుంచి ఆయనకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. . ఇప్పుడు రామ్ హీరోగా రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’లో విలన్ గా కనిపించబోతున్నాడు. అలాగే ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న `రాజాసాబ్` లోనూ తనకు ఓ అత్యంత కీలకమైన పాత్ర దక్కింది. అలాగే రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాకు కూడా ఆయన్ను అడుగుతున్నట్లు చెప్పుకుంటున్నారు. హిందీ మార్కెట్ లోనూ తమ సినిమాలను దించాలనుకున్నప్పుడు సంజయ్ దత్ అందరికీ బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నారు. దాంతో తెలుగు సినిమాల్లో సంజయ్ దత్ లాంటి బాలీవుడ్ స్టార్ కనిపించడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే సంజయ్ దత రెమ్యునరేషన్ సైతం పెంచేసినట్లు తెలుస్తోంది.
‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా కోసం సంజయ్ దత్ ఏకంగా రూ.8 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. . ఇప్పుడు ప్రభాస్ సినిమా `రాజాసాబ్` కోసం రూ.10 కోట్లు డిమాండ్ చేసి తీసుకుంటున్నారట. పది కోట్లూ ప్లస్ ఆయన ఖర్చులు అదనంగా మరో రూ.2 కోట్ల వరకూ అవుతాయని చెప్తున్నారు. ముంబై నుంచి ఇక్కడకి రావటానికి స్పెషల్ ప్లైట్ ఎరేంజ్ చేస్తారు. అలాగే ఆయన టీమ్ లో మొత్తం ఎనిమిదిమంది స్టాఫ్ ఉంటారని, వాళ్ల జీతాలు, బేటాలు,ఎకామ్డేషన్ అన్నీ… నిర్మాతలే చూసుకోవాలి అంటున్నారు. ఈ రకంగా నిర్మాతలు చాలా బడ్జెట్ అవుతోంది. అయితే సంజయ్ దత్ ఉండటంతో బిజినెస్ సైతం అదే విధంగా అవుతోందిట.
ఇక రామ్ చరణ్ ,బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందబోయే చిత్రం ఎనౌన్సమెంట్ రావటంతో అందరి దృష్టీ ఈ సినిమాపై పడింది. ఆర్సీ16 వర్కింగ్ టైటిల్ తో చేస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రల కోసం ఇప్పుడు ఆర్టిస్ట్ ల ఎంపిక జరుగుతోంది. అందులో భాగంగా ఈ చిత్రం విలన్ ని సెట్ చేసారని సమాచారం. ఈ చిత్రంలో సంజయ్దత్ విలన్ గా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే చిత్రటీమ్ ఆయన్ని సంప్రదించినట్లు సమాచారం. కథ, తన పాత్ర పవర్ఫుల్గా ఉండటంతో ఆయన ఓకే అన్నారని, ఎగ్రిమెంట్ అయ్యాకనే ఎనౌన్సమెంట్ వస్తుందని కథనాలు వెలువడుతున్నాయి.