‘అర్జున్ రెడ్డి’ టైటిల్ నే నా కొడుక్కి పేరుగా పెట్టా
‘అర్జున్ రెడ్డి’ తెలుగు సినిమా బాక్సాఫీసులను బద్దలు చేసిన మూవీ.
‘అర్జున్ రెడ్డి’ తెలుగు సినిమా బాక్సాఫీసులను బద్దలు చేసిన మూవీ. విజయ్ దేవరకొండను కెరీర్ పరంగా ఎక్కడికో తీసుకెళ్లిన సినిమా అది. సందీప్ రెడ్డి వంగా ఆ సినిమాను డిఫరెంట్ కథగా తెరకెక్కించారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఆ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. అంతలా పేరు తెచ్చుకున్న ఈ సినిమా ఈ నెల 21వ తేదీన బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కబీర్ సింగ్’ చిత్రంలో షాహిద్ సరసన హీరోయిన్ గా కియారా అద్వానీ నటించింది.
తనను ఓవర్ నైట్ లో స్టార్ డైరక్టర్ చేసిన ఈ చిత్రం టైటిల్ ని తన కుమారుడుకు పేరుగా పెట్టుకున్నాను అంటున్నారు సందీప్ రెడ్డి. జూన్ 21 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న హిందీ అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో ఈ విషయం చెప్పుకొచ్చారు సందీప్ రెడ్డి వంగా.
సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ .. ‘అర్జున్ రెడ్డి’ అనే సినిమాను నేను ఓ యజ్ఞంలా భావించి నా ప్రాణం పెట్టి చేశాను. ఈ నా ప్రయత్నంలో నిర్మాతలు,కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిది . అందుకే నా కొడుకుకి ‘అర్జున్ రెడ్డి’ అనే పేరు పెట్టుకున్నాను. ఆ సినిమా అంటే నాకు ఎంత ఇష్టమనేది ఇప్పుడు మీకు అర్థమైపోయుంటుంది. ‘కబీర్ సింగ్’ కూడా అందరికి నచ్చి మంచి విజయం సాదిస్తుందని అని అన్నారు.