Asianet News TeluguAsianet News Telugu

‘సర్కారు వారి పాట’ లో 'క్రాక్' విలన్

 సముద్ర ఖనిని తమ  ‘సర్కారు వారి పాట’ సినిమాలోనూ తీసుకోవాలని చిత్ర యూనిట్‌ భావిస్తున్నట్లు సమాచారం. చిత్ర టీమ్ ఈ విషయాన్ని ఇంకా అధికారకంగా వెల్లడించనప్పటికీ నెట్టింట మాత్రం ఇది వైరల్ అవుతోంది.

Samutrakani joins Maheshs Sarkaru Vaari Pata jsp
Author
Hyderabad, First Published Jul 11, 2021, 2:25 PM IST

తమిళ దర్శకుడు,నటుడు అయిన సముద్ర ఖని ఇప్పటికే బన్నీ హీరోగా తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’, రవితేజ లీడ్‌ రోల్‌లో వచ్చిన ‘క్రాక్‌’ సినిమాలో విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో సముద్రఖని తనదైన నటనతో ఆకట్టుకున్నారు. దీంతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యారు. ఈ నేపధ్యంలో  సముద్ర ఖనిని తమ  ‘సర్కారు వారి పాట’ సినిమాలోనూ తీసుకోవాలని చిత్ర యూనిట్‌ భావిస్తున్నట్లు సమాచారం. చిత్ర టీమ్ ఈ విషయాన్ని ఇంకా అధికారకంగా వెల్లడించనప్పటికీ నెట్టింట మాత్రం ఇది వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. ‘గీత గోవిందం’ సినిమాతో బంపర్ హిట్ కొట్టిన పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. మహేష్ అభిమానులు ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందకు రావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. గత ఏడాది ఆరంభంలో ఈ సినిమా ను ప్రకటించిన యూనిట్‌ సభ్యులు కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా పట్టాలెక్కించారు.

మొదటి షెడ్యూల్‌ పూర్తి అయిన తర్వాత రెండవ షెడ్యూల్‌ కు వెళ్లే క్రమంలో కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా షూటింగ్‌ నిలిచి పోయింది.మళ్లీ సర్కారు వారి పాట రెండవ షెడ్యూల్‌ కు టైమ్‌ వచ్చింది. ఈ సమయంలో ఆసక్తికర చర్చ ఒకటి జరుగుతుంది.ఈ సినిమాలో విలన్ పాత్రను ఎవరు పోషించబోతున్నారు అనే విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

మొదట ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు విలన్ గా నటించబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి.ఆ తర్వాత యాక్షన్‌ కింగ్‌ అర్జున్ ను విలన్ పాత్రకు గాను తీసుకున్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా అర్జున్‌ ఇతర ప్రాజెక్ట్‌ ల వల్ల బిజీగా ఉండటంతో ఆయన స్థానంలో తమిళ స్టార్‌ నటుడు సముద్ర ఖని ని ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. 

 మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తీ సురేష్‌ చేస్తున్నారు.  బ్యాంకు మోసాల బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివెంజ్‌ డ్రామాయే ఈ చిత్రం అని, ఓ బ్యాంకు మేనేజర్‌ కొడుకుగా మహేశ్‌ పాత్ర ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. 

సంగీతం  తమన్ అందించబోతున్నాడట.  అలాగే చాలా కాలం తర్వాత మహేష్ రొమాంటిక్ బాయ్ గా నటించబోతున్నాడు. మహేష్ ను ఒక మ్యాచుర్డ్ లవ్ స్టోరీలో చూపించబోతున్నట్లు సమాచారం.  భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ బయటకు రానుంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios