Asianet News TeluguAsianet News Telugu

`యశోద`గా సమంత.. ఫస్ట్ పాన్‌ ఇండియా మూవీ స్టార్ట్.. జోరు మామూలుగా లేదుగా!


'ఫ్యామిలీ మేన్ 2' వెబ్ సిరీస్‌తో సమంతకు జాతీయ స్థాయిలో పేరొచ్చింది. ఆమెకు క్రేజ్ ఏర్పడింది. సమంత నటనకు వీక్షకులు సహా విమర్శకులు ఫిదా అయ్యారు. తెలుగు, తమిళ సినిమాల్లో పోషించిన పాత్రలకు భిన్నమైన పాత్రను ఆ వెబ్ సిరీస్‌లో చేశారు. దాంతో సమంత పొటెన్షియల్ ఏమిటన్నది అందరికీ తెలిసింది.

samantha turn as yashoda first pan india movie started
Author
Hyderabad, First Published Dec 6, 2021, 5:09 PM IST

సమంత(Samantha) జోరు మామూలుగా లేదు. నాగచైతన్యతో డైవర్స్ ప్రకటన తర్వాతే తనలోని మరో సమంతని బయటకు తీస్తుందా? అనే ఫీలింగ్‌ని కలిగిస్తుంది. తాజాగా తన కొత్త సినిమా అప్‌డేట్‌ని వెల్డడించింది. ఫస్ట్ పాన్‌ ఇండియా సినిమా వివరాలను వెల్లడిచింది. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రానికి తాజాగా `యశోద`(Yashoda) టైటిల్‌ని కన్ఫమ్‌ చేశారు. ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాకి హరి, హరీష్‌లు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ తెరకెక్కిస్తుండటం విశేషం. 

ఈ సందర్భంగా చిత్ర బృందం చెబుతూ, ``ఫ్యామిలీ మేన్ 2' వెబ్ సిరీస్‌తో సమంతకు జాతీయ స్థాయిలో పేరొచ్చింది. ఆమెకు క్రేజ్ ఏర్పడింది. సమంత నటనకు వీక్షకులు సహా విమర్శకులు ఫిదా అయ్యారు. తెలుగు, తమిళ సినిమాల్లో పోషించిన పాత్రలకు భిన్నమైన పాత్రను ఆ వెబ్ సిరీస్‌లో చేశారు. దాంతో సమంత పొటెన్షియల్ ఏమిటన్నది అందరికీ తెలిసింది. ప్రస్తుతం సమంతకు ఉన్న క్రేజ్‌కు, పొటెన్షియ‌ల్‌కు త‌గ్గ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్ర‌మిది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషలో తెరకెక్కిస్తున్నాం` అని చెప్పింది. 

నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, `సమంత ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రమిది. బాలకృష్ణగారితో `ఆదిత్య 369` తీశాను. ఆయనతో మరో మూడు చిత్రాలు చేశాను. నానితో `జెంటిల్‌మన్`, సుధీర్‌బాబుతో `సమ్మోహనం` నిర్మించాను. ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. థ్రిల్లర్ జాన‌ర్‌లో నేషనల్ లెవ‌ల్‌లో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే కథాంశంతో తీస్తున్న చిత్రమిది. సమంత క్రేజ్, పొటెన్షియల్, ఫ్యాన్ ఫాలోయింగ్‌కు తగ్గ కథ కుదిరింది. 

ఈ రోజు(సోమవారం) పూజా కార్యక్రమాలతో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేశాం. మార్చితో చిత్రీకరణ పూర్తవుతుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు` అని చెప్పారు. తమిళంలో 'మైనా', 'కుంకీ', 'గీతు'... తెలుగులో 'చిలసౌ', 'రిపబ్లిక్' తదితర సినిమాలకు పని చేసిన ఎం. సుకుమార్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించనున్నారు.

Samanthaతో పాటు సినిమాలో నటించే ఇతర తారాగణం వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: ఆర్. సెంథిల్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: రషీద్ అహ్మద్ ఖాన్, రామాంజనేయులు, ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, కెమెరా: ఎం. సుకుమార్, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి.

also read: Pushpa:‘పుష్ప’నైజాం రైట్స్ దిల్ రాజుకే...ఎంతకంటే

Follow Us:
Download App:
  • android
  • ios