'ఆదిత్య 369' నిర్మాతకు సమంత గ్రీన్ సిగ్నల్.. ఎవ్వరూ అటెంప్ట్ చేయని సబ్జెక్ట్ తో డేరింగ్ స్టెప్
సమంత సౌత్ లో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత దేశవ్యాప్తంగా ఆమె క్రేజ్ పెరిగింది. ఓ వైపు పర్సనల్ లైఫ్ గురించి రూమర్స్ వైరల్ అవుతున్నప్పటికీ సమంత తన చిత్రాలతో దూసుకుపోతోంది.
సమంత సౌత్ లో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత దేశవ్యాప్తంగా ఆమె క్రేజ్ పెరిగింది. ఓ వైపు పర్సనల్ లైఫ్ గురించి రూమర్స్ వైరల్ అవుతున్నప్పటికీ సమంత తన చిత్రాలతో దూసుకుపోతోంది. వివాహం తర్వాత సమంత మెమొరబుల్ బ్లాక్ బస్టర్స్ లో నటించింది.
ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో పౌరాణిక చిత్ర శాకుంతలంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సమంత మరో క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆదిత్య 369, వంశానికొక్కడు, నాని జెంటిల్మెన్, సమ్మోహనం లాంటి సూపర్ హిట్ చిత్రాలని నిర్మించిన శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో నటించేందుకు సమంత ఓకె చెప్పినట్లు తెలుస్తోంది.
శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించనున్నారు. ఓ డెబ్యూ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. డైరెక్టర్ చెప్పిన కథ అద్భుతంగా ఉండడంతో సామ్ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇంతవరకు ఎవరూ అటెంప్ట్ చేయని పాయింట్ తో దర్శకుడు కథని సిద్ధం చేసుకున్నారట. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం.
ఇటీవల సామ్ లేడి ఓరియెంటెడ్ చిత్రాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. ఓ బేబీ, శాకుంతలం లాంటి చిత్రాలు ఆ కోవకు చెందినవే. త్వరలోనే కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో చిత్రానికి ప్రకటన రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా చై సామ్ మధ్య వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సమంత ప్రస్తుతం ముంబైకి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది.