`సైంధవ్` అసలు కథ ఇదేనా?.. వెంకటేష్కి చేతబడితో పనేంటి?
వెంకటేష్ అంటే ఫ్యామిలీ చిత్రాల అనే పేరుంది. ఆ ముద్ర నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు వెంకీ మామ. కొత్తగా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు పూర్తి యాక్షన్తో `సైంధవ్` మూవీ చేస్తున్నారు.
వెంకీ మామ వెంకటేష్.. అంటే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లే గుర్తుకొస్తుంటాయి. పాటల్లో గ్లామర్ ఉంటుంది, కానీ ఆయన నటించిన చాలా సినిమాలు చాలా క్లీన్గా ఉంటాయి. అయితే మధ్యలో కొన్ని యాక్షన్ సినిమాలుకూడా చేశాడు వెంకటేష్. అందులో కొన్నిసక్సెస్ అయితే, చాలా వరకు నిరాశ పరిచాయి. ఇటీవల కాలంలో `నారప్ప`తో యాక్షన్ ట్రై చేశాడు. వర్కౌట్ కాలేదు. కానీ ఈ సారి పర్ఫెక్ట్ యాక్షన్తో వస్తున్నాడు వెంకీ. `హిట్` చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో `సైంధవ్` చిత్రం చేస్తున్నాడు. ఇది పూర్తిస్తాయి హై ఓల్టేజ్ మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. చూడ్డానికి కమల్ `విక్రమ్` స్టయిల్లో సాగుతుందని తెలుస్తుంది.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే అది స్పష్టమవుతుంది. పోర్ట్ ఏరియాలో ప్రధానంగా సినిమా సాగుతుందని తెలుస్తుంది. సినిమా ప్రధానంగా మెడికల్ మాఫియా నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ అంశాల ప్రధానంగా సాగుతుందని తెలుస్తుంది. అయితే దీనికి మరో అప్డేట్ లీక్ అయ్యింది. ఇది చేతబడుల నేపథ్యంలో సాగే చిత్రమని అంటున్నారు. చేతబడుల పాయింట్కి సైన్స్ ఫిక్స్, మెడికల్ మాఫియా అంశాలను జోడించి దర్శకుడు శైలైష్ `సైంధవ్` సినిమాని తెరకెక్కిస్తున్నారట. కర్నాటక బ్యాక్ డ్రాప్లో సినిమా సాగుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. `సైంధవ్` కథ ఇదే అని, కాన్సెప్ట్ ఇదే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇటీవల చేతబడుల నేపథ్యంలో హార్రర్ థ్రిల్లర్గా `విరూపాక్ష` సినిమా వచ్చింది. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో సంయుక్త హెగ్డే కథానాయికగా నటించింది. ఈ సినిమాపెద్ద విజయం సాధించింది. సాయిధరమ్ తేజ్కి కమ్ బ్యాక్నిచ్చింది. ఇప్పుడు శైలేష్ కూడా అనే కాన్సెప్ట్ ని ఫాలో అవుతున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. వెంకటేష్ నటించిన మాస్ యాక్షన్ మూవీ `గణేష్` కూడా మెడికల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కింది. పెద్ద హిట్ అయ్యింది.ఆల్మోస్ట్ మరోసారి వెంకీ ఆ ఫార్మాట్లో వస్తున్నట్టు సమాచారం.
ఇందులో శ్రద్ధా శ్రీనాథ్.. హీరోయిన్గా నటిస్తుంది. రుహాని శర్మ మరో హీరోయిన్. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. సంతోష్నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.