బాలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇబ్రహీం ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరుణ్ జోహార్ లాంచ్ చేస్తున్నారు. ఇందుకోసం ఓ సౌత్  రీమేక్ ని ఆయన ఎంచుకున్నారు.


బాలీవుడ్ ప్రముఖ నటుడు, పటౌడీ వారసుడు సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు వరస సినిమాలతో బిజీగా ఉన్నారు.1991లో వివాహం చేసుకున్న సైఫ్, అమృత 2004లో విడాకులు తీసుకున్నారు. వీరికి సారా, ఇబ్రహీం జన్మించారు. అలాగే రెండో భార్య కరీనా కపూర్ వల్ల తైమూర్, జహంగీర్ జన్మించారు.  ఇప్పుడు ఆయన మొదట భార్య పిల్లలు కూడా సినిమాల్లోకి వస్తున్నారు. ఇప్పటికే ఆయన కుమార్తె సారా అలీ ఖాన్ సిని పరిశ్రమలో దూసుకుపోతోంది. ఇక ఆయన కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ సైతం సినీ  రంగ ప్రవేశానికి సిద్దపడుతున్నారు. బాలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇబ్రహీం ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరుణ్ జోహార్ లాంచ్ చేస్తున్నారు. ఇందుకోసం ఓ సౌత్  రీమేక్ ని ఆయన ఎంచుకున్నారు.

ఆ సినిమా మరేదో కాదు..మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ హీరోగా నటించిన సినిమా 'హృదయం'. రూ. 6 కోట్లతో తీస్తే... సుమారు రూ. 55 కోట్లు వసూలు చేసింది. దర్శనా రాజేంద్రన్, కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి తెలుగునాట కూడా మంచి స్పందన లభించింది.  కాలేజీ రోజుల నుంచి వైవాహిక బంధం వరకు ఓ యువకుడి భావోద్వేగభరిత జీవిత ప్రయాణానికి అందమైన దృశ్యరూపంగా నిలిచింది. హైదరాబాద్‌లో కొన్ని థియేటర్లలో స‌బ్ టైటిల్స్‌తో మలయాళంలో సినిమా విడుదలైంది. మలయాళీలతో పాటు తెలుగు ప్రేక్షకులు కొంత మంది సినిమా చూశారు.

  'హృదయం'  త్వరలో తెలుగులో రీమేక్ కానుందీ సినిమా. తెలుగులోనే కాదు, హిందీ, తమిళంలోనూ రీమేక్ కానుంది. హిందీకు సైఫ్ కుమారుడుని ఎంపిక చేసారు. 'హృదయం' తెలుగు, తమిళ, హిందీ రీమేక్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ దక్కించుకున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థతో కలిసి ఆయనకు చెందిన నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై సినిమాను తెరకెక్కించనున్నారు. హీరో హీరోయిన్లు, దర్శకుడిని ఇంకా ఫైనలైజ్ చేయలేదు. త్వరలో ఆ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

ఇక కెరీర్‌లో విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ అలరిస్తున్న బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌. మల్టీస్టారర్‌ సినిమాల్లో తనదైన ముద్రవేశారు. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఆదిపురుష్‌’లో  రావణ్‌ పాత్రలో నటిస్తున్నారు. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కృతి ససన్‌ కథానాయిక. సైఫ్‌ త్వరలో అణు భౌతిక శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబాగా నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. చిత్రానికి విక్రమ్‌జిత్ సింగ్‌ దర్శకత్వం వహించనున్నారట. ‘రాయ్‌’, ‘నేచర్‌’వంటి చిత్రాలకు విక్రమ్‌ దర్శకత్వం వహించారు. న్యూక్లియర్‌ సైంటిస్ట్‌ హోమి బాబా జీవితాధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితం కానుంది.