Asianet News TeluguAsianet News Telugu

బాబోయ్, సాయి ధరమ్ తేజ్ ని నమ్మి 120 కోట్లు ?.. పాన్ ఇండియా చిత్రంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామా 

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కి ప్రమాదం తర్వాత పునర్జన్మ లభించినట్లు అయింది. ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత తేజు విరూపాక్ష చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

Sai Dharam Tej new movie details are shocking dtr
Author
First Published Jul 3, 2024, 8:30 PM IST

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కి ప్రమాదం తర్వాత పునర్జన్మ లభించినట్లు అయింది. ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత తేజు విరూపాక్ష చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత  తేజు.. పవన్ కళ్యాణ్ తో కలసి బ్రో చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ డెబ్యూ డైరెక్టర్ కెపి రోహిత్ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం గురించి సంచలన విషయాలు వైరల్ అవుతున్నాయి. నిర్మాత సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రాన్ని 120 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నారట. 

హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ సెట్ నిర్మాణానికే కోట్ల రూపాయలు ఖర్చయినట్లు తెలుస్తోంది. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి కలసి ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. 

ఎంత పాన్ ఇండియా చిత్రం అయినా సాయి ధరమ్ తేజ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని 120 కోట్లకు ఖర్చు చేయడం సాహసమే అని సినీ విశ్లేషకులు అంటున్నారు. పైగా డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మరి ఈ సాహసం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios