ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కాంట్రవర్సీ: బైట్స్ ఇచ్చే ముందు జాగ్రత్త, శ్రీకాంత్!... నరేష్ స్ట్రాంగ్ వార్నింగ్
సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై నటుడు నరేష్ విడుదల చేసిన వీడియో సందేశాన్ని శ్రీకాంత్ తప్పుబట్టగా,నేడు నరేష్ కౌంటర్ ఇచ్చారు.
సాయి ధరమ్ తేజ్ ప్రమాద సంఘటన 'మా' రాజకీయ రంగు పులుముకుంటున్నట్లు కనిపిస్తుంది. రెండు వేర్వేరు ప్యానెల్స్ కి సప్పోర్ట్ చేస్తున్న శ్రీకాంత్, నరేష్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై నటుడు నరేష్ విడుదల చేసిన వీడియో సందేశాన్ని శ్రీకాంత్ తప్పుబట్టగా,నేడు నరేష్ కౌంటర్ ఇచ్చారు. సాయి ధరమ్ తేజ్ ఆక్సిడెంట్ ని ప్రస్తావిస్తూ గతంలో చనిపోయినవారిని గుర్తు చేయడం సమంజసం కాదు, నరేష్ వ్యాఖ్యలు అసందర్భం అంటూ, అలాంటి బైట్స్ విడుదల చేయకుండా ఉండాల్సింది అంటూ.. శ్రీకాంత్ ఓ వీడియో బైట్ విడుదల చేశారు.
శ్రీకాంత్ మాటలను ఉద్దేశిస్తూ నరేష్... నేను మాట్లాడిన మాటలను మీడియా వక్రీకరించి రాయడంతో పెద్దలు నాకు కాల్స్ చేశారు. దానితో నేను నా ఉద్దేశం ఏమిటో తెలియజేస్తూ మరో వీడియో విడుదల చేశాను. సాయి ధరమ్ కి జరిగింది ఖచ్చితంగా ప్రమాదమే, రోడ్డుపై ఉన్న మట్టి వలన జరిగిన ప్రమాదం. రాష్ డ్రైవింగ్ వలన జరిగింది కాదు.
కానీ శ్రీకాంత్ నువ్వు అలాంటి బైట్ ఇచ్చావ్ ఏంటమ్మా. బైట్స్ ఇచ్చే ముందు నువ్వు జాగ్రత్తగా ఉండాలి.ఎందుకంటే ఇందులో ఎమోషన్స్ ఇన్వాల్స్ అయ్యాయి. చనిపోయిన వారి గురించి నేను చెప్పలేదు. జనరల్ గా పరిశ్రమలో జరిగింది మాట్లాడాను. నువ్వు మాట్లాడింది నన్ను హర్ట్ చేసింది. నా కళ్ళ ముందు హీరోగా వచ్చావ్, మంచి మంచి సినిమాలు చేశావ్. పేరు తెచ్చుకున్నారు. మా ఎలక్షన్స్ లో నా ప్యానల్ కి వ్యతిరేకంగా పోటీ చేసి దురదృష్టవశాత్తు ఓడిపోయావ్. నేను ఇండస్ట్రీలో 50ఏళ్లకు పైగా ఉన్నాను. ఇండస్ట్రీలో పుట్టి పెరిగాను. నా వ్యాఖ్యలు రాజకీయంగా, సినిమాల పరంగా ఎప్పుడూ కాంట్రవర్సీ కాలేదు.
నువ్వు కూడా మంచివాడివి, బైట్స్ ఇచ్చే ముందు పెద్దలతో మాట్లాడి ఇవ్వమ్మా... సాయి ధరమ్ తేజ్ కి జరిగింది ఖచ్చితంగా ప్రమాదమే. కానీ పిల్లలకు చెప్పడం మన బాధ్యత.. అంటూ ముగించారు. నరేశ్ కామెంట్స్ ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి.