మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం చిత్ర లహరి ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయి కొన్ని విషయాలపై వివరణ ఇచ్చాడు.

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం చిత్ర లహరి ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయి కొన్ని విషయాలపై వివరణ ఇచ్చాడు. కావాలని సినిమాలో గ్లాస్ గుర్తును వాడారు అని వస్తోన్న కామెంట్స్ పై కూడా మెగా మేనల్లుడు స్పందించాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నేను కథ విన్న కొన్ని నెలలకు ముందే పాట కోసం గ్లాస్ ని అనుకున్నాం. ఆ తరువాత జనసేన గుర్తు కూడా అదే వచ్చింది. నిజంగా ఇది అనుకోకుండా జరిగింది. అయినా ఈ విషయంలో ఆ విధంగా మ్యాచ్ అయినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని సాయి వివరణ ఇచ్చాడు. 

ఇక సినిమా రిజల్ట్ పై చాలా నమ్మకంతో ఉన్నట్లు చెబుతూ.. చాలా మంది ఇది సక్సెస్ లేకుండా ఉన్న.. తన బయోపిక్ అని అంటున్నారు. కానీ అలాంటిదేమి లేదని సాయి తెలిపాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా ఏది ఫైనల్ కాలేదని చిత్రలహరికి వచ్చే రెస్పాన్స్ ను బట్టి ఆ కథలపై ఒక నిర్ణయం తీసుకుంటానని సాయి క్లారిటీ ఇచ్చారు.