మారుతి చిత్రంలో సాయి తేజ క్యారక్టర్ ఇంట్రస్టింగ్ , అదేంటంటే..?
చిన్న పాయింట్ చుట్టూ ఫన్ చేసి హిట్ కొట్టే దర్శకుడు మారుతి. గతంలో మారుతి దర్శకత్వంలో వచ్చిన భలే భలే మొగాడివోయ్ ఆయన సత్తా ఏమిటో చూపించింది.
చిన్న పాయింట్ చుట్టూ ఫన్ చేసి హిట్ కొట్టే దర్శకుడు మారుతి. గతంలో మారుతి దర్శకత్వంలో వచ్చిన భలే భలే మొగాడివోయ్ ఆయన సత్తా ఏమిటో చూపించింది. దాంతో ఆయన తాజా చిత్రాలపై ఎప్పుడు మంచి అంచనాలే ఉంటాయి. తాజాగా మారుతి, సాయి తేజ కాంబినేషన్ లో ఓ చిత్రం పట్టాలెక్కబోతోంది. దాంతో ఆ చిత్రంలో సాయి తేజ ఏ పాత్ర చేయబోతన్నాడనేది హాట్ టాపిక్ గా మారింది.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సాయి తేజ కాసనోవా పాత్రలో కనిపించబోతున్నారు. ప్లేబోయ్ పాత్రకు కాసనోవా పాత్రకు చాలా తేడా ఉంది. ఆ పాత్ర ప్రేమ కోసం పరితపిస్తూ అందుకోసం ఓ చిన్న డ్రామా ఆడుతుంది. ఆ పాత్రలో సాయి తేజ ను చూపించబోతున్నారట. ఈ పాత్రలో సాయి ఏ రకంగా మనల్ని మెప్పిస్తారో చూడాలి.
ఇక నాగచైతన్య తో చేసిన ‘శైలజారెడ్డి అల్లుడు’ డిజాస్టర్ చిత్రం దర్శకుడు మారుతి ని బాగా వెనక్కి తీసుకెళ్లిపోయింది. మొత్తానికి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో చేయడానికి ఫైనల్ అయ్యింది. మరో ప్రక్క సాయి ధరమ్ ‘చిత్రలహరి’ చేసి చాలా కాలం తర్వాత రిలాక్స్ ఉన్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం యావరేజ్ అనుకున్నా సాయిని ఒడ్డున పడేసింది.
ఈ ఉత్సాహంతో మారుతి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి రావాలని ప్రయత్నంలో ఉన్నాడు సాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి భోగి అనే టైటిల్ ని పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 2020 సంక్రాంతి సమయంలో ఈ సినిమాను విడుదల చేస్తారు కాబట్టి ఆ టైటిల్ యాప్ట్ గా ఉంటుందని భావిస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా రెజీనా కసాండ్రా పేరు వినిపిస్తున్నప్పటికీ ఆమె బదులు మరొక స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని ప్రయత్నాలైతే జరుగుతున్నట్లు సమాచారం. గీతా ఆర్ట్స్ మరియు యు వి క్రియేషన్స్ ఈ సినిమాను సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు.