యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన ప్రభాస్ సాహో సినిమా ఆగస్ట్ 30న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ డోస్ కూడా పెంచేస్తోంది. అలాగే ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ని చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసింది.
యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన ప్రభాస్ సాహో సినిమా ఆగస్ట్ 30న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ డోస్ కూడా పెంచేస్తోంది. అలాగే ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ని చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసింది.
రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ నెల 18న ఈవెంట్ ను నిర్వహించనున్నారు. డేట్ అండ్ ప్లేస్ తెలియగానే అభిమానులు ఈవెంట్ పాసెస్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత వారం నుంచి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ నెల 18, 24వ తేదీల్లో ఎదో ఒక డేట్ ని ఫైనల్ చేయాలనీ యూవీ క్రియేషన్స్ ఆలోచించింది.
ఫైనల్ గా 18 బెస్ట్ డేట్ అని రామోజీ ఫిల్మ్ సిటీలో వేడుకను గ్రాండ్ గా జరిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆగస్ట్ 15న సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాహో గేమ్ ను రిలీజ్ చేయనున్నారు. మంగళవారం విడుదలైన గేమ్ టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 14, 2019, 2:11 PM IST