‘సాహో’ ఓవర్ సీస్ రైట్స్ ఎంతకు ఇచ్చేసారంటే...
‘సాహో’ కొత్త రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. షూటింగ్ దశలో ఉండగానే బయ్యర్లు భారీ మొత్తాలు పట్టుకుని రైట్స్ కోసం నిర్మాతల చుట్టూ ప్రదక్షణాలు చేస్తున్నారు.
‘సాహో’ కొత్త రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. షూటింగ్ దశలో ఉండగానే బయ్యర్లు భారీ మొత్తాలు పట్టుకుని రైట్స్ కోసం నిర్మాతల చుట్టూ ప్రదక్షణాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం హిందీ రైట్స్ టీ సీరిస్ వారు 125 కోట్లు పెట్టి తీసుకున్నారు. తాజాగా మరో రికార్డ్ ని ఈ చిత్రం క్రియేట్ చేసింది. వివరాల్లోకి వెళితే..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సాహో’. యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్లో రూపొంందుతున్న ఈ చిత్రాన్ని యు.వి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుండడంతో పాటు.. ప్రభాస్ క్రేజ్ కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యింది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవర్ సీస్ రైట్స్ ను యు.ఎ.ఇకి చెందిన ఫర్స్ పిలింస్ డిస్ట్రిబ్యూటర్ 36 కోట్లకు ఇచ్చేసారట. ఈ సినిమా విడుదల విషయానికి వస్తే సినిమా ఆగస్ట్లో కాకుండా దసరాకు విడుదలయ్యే అవకాశాలున్నాయని టాక్.
శ్రధ్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎలివెన్ శర్మ, నీల్ నితిన్ ముకేష్, జాకీష్రాప్, మందిరా బేడీ, మహేష్ మంజ్రేకర్, చంకీ పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు.