"ఆర్ఎక్స్ 100" వంటి సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా మారిన అజయ్ భూపతి,మహా సముద్రం తర్వాత ఏ ప్రాజెక్టు కమిటవ్వలేదు. ఇప్పుడు ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
ఆర్ఎక్స్ 100 సినిమాతో పెద్ద హిట్ కొట్టారు డైరక్టర్ అజయ్ భూపతి. ఆ సినిమాతో ఒక్క సారిగా హీరోలు అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్నారాయన. మొదటి సినిమాతోనే ముచ్చెమటలు పట్టించిన ఈ డైరక్టర్ .. తప్పకుండా భవిష్యత్తులో పెద్ద దర్శకుడు అవుతాడని ప్రతి ఒక్కరు కూడా భావించారు. అయితే ఆయన తన రెండవ సినిమా చేయడానికి చాలా రోజుల సమయాన్ని తీసుకోవడం కొంతమందిని ఎంతగానో ఆశ్చర్యపరిచింది. మొత్తానికి మహాసముద్రం టైటిల్ తో ఓ సినిమాను చాలా రోజుల తర్వాత రూపొందించి విడుదల చేయగా ఆ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించకపోవడం ఈ దర్శకుడికి అవకాశాల కరువు ఏర్పడింది. ఆ సినిమా డిజాస్టర్ అవటం ఆయన్ని పూర్తిగా నిరాశపరిచింది.
ఈ సినిమాని చాలా మంది హీరోలు రిజెక్ట్ చేసారు. చాలా మంది సన్నిహితులు ఈ సినిమా చేయవద్దని అన్నారట. అయినా ఈ దర్శకుడు ఎవరేమీ చెప్పినా వినకుండా మహాసముద్రం సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ సినిమా ను మొదలుపెట్టాడు. అందులో ఎలాంటి మార్పులు చేయకుండా మొండి పట్టుదలతో ఆ సినిమాను చేసి భారీ ఫ్లాప్ ను ఎదుర్కొన్నాడు. మొదటగా ఈ సినిమా కోసం రవితేజను హీరోగా అనుకోగా ఆయన దాన్ని రిజెక్ట్ చేశాడు. ఆ తరువాత నాగచైతన్య హీరోగా అనుకున్నారు ఆయన కూడా చేయలేదు. చివరగా ఈ చిత్రాన్ని శర్వానంద్ చేయగా ఆ చిత్రం ఆయనకు భారీ పరాజయాన్ని తెచ్చిపెట్టింది. అయితే ఒక సినిమా పోయినంత మాత్రాన ఆయనలోని టాలెంట్ ఎక్కడికీ పోదు. ఇప్పుడు ఆయన మరో చిత్రం రూపొందించటానికి సన్నాహాలు మొదలెట్టారు.
అయితే ఇప్పుడు ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం చేయబోతున్నట్లు సమాచారం. ప్రధాన పాత్రలో ఓ స్టార్ హీరోయిన్ ని ఎంచుకోబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు తన కథతో హీరోయిన్స్ ని కలిసి కథ వినిపిస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉంది. ఓ పెద్ద బ్యానర్ వారే ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు వినిపిస్తోంది. అయితే అఫీషియల్ సమాచారం ఏమీ లేదు. ఈ సారి ఆర్ ఎక్స్ 100 ని మించిన హిట్ కొడతారని, స్క్రిప్టు ఆ స్దాయిలో చేసారని మాత్రం చెప్పుకుంటున్నారు. ఓ రకంగా ఇది ఈ డైరక్టర్ కు కీలకమైన పరీక్ష సమయం. హిట్ కొడితే నిలబడగలుగుతారు.