Asianet News TeluguAsianet News Telugu

సాయిపల్లవితో గొడవ?.. క్లారిటీ ఇచ్చిన రకుల్!

చాలా కాలం తరువాత సౌత్ లో హీరోయిన్స్ మధ్య ఈగో ఫైట్ నడిచినట్లు ఇటీవల రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి. రకుల్ ప్రీత్ సింగ్ - సాయి పల్లవి మధ్య కంటికి కనిపించని క్లాష్ జరిగిందని టాక్ రాగా ఈ విషయంపై రకుల్ తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చింది. 

rskul comments on sai pallvi
Author
Hyderabad, First Published May 29, 2019, 9:18 AM IST

చాలా కాలం తరువాత సౌత్ లో హీరోయిన్స్ మధ్య ఈగో ఫైట్ నడిచినట్లు ఇటీవల రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి. రకుల్ ప్రీత్ సింగ్ - సాయి పల్లవి మధ్య కంటికి కనిపించని క్లాష్ జరిగిందని టాక్ రాగా ఈ విషయంపై రకుల్ తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చింది. 

సూర్య NGK సినిమాలో వీరిద్దరూ హీరోయిన్స్ గా స్క్రీన్ షేర్ చేసుకున్న  సంగతి తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ లో ఇద్దరి మధ్య అహం ఏర్పడి ఎడమొహం పెడ మొహం వేసినట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సినిమాలో సాయి పల్లవి పాత్రను ఎక్కువగా ఫోకస్ చేసి రకుల్ ని తక్కువగా చూపించడం వల్ల వారి మధ్య వార్ మొదలైనట్లు టాక్ వచ్చింది. 

అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. అసలు తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉందని చెబుతూ.. తన పాత్రతో పాటు నా పాత్ర కూడా సినిమాలో చాలా ముఖ్యమైనదని రకుల్ తెలిపింది. సెల్వా రాఘవన్ దర్శకత్వం వహించిన NGK శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios