`ఆర్ఆర్ఆర్`కి మరో ప్రతిష్టాత్మక పురస్కారం.. కీరవాణికి అవార్డుల పంట
ఇటీవల `గోల్డెన్ గ్లోబ్` అవార్డుతో ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ సినిమా సత్తాని చాటింది `ఆర్ఆర్ఆర్`. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక అవార్డుని సొంతం చేసుకుంది.
`ఆర్ఆర్ఆర్` చిత్రం ఇండియన్ సినిమా సత్తాని, తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటుకుంటోంది. ఇది గ్లోబల్ వైడ్గా అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పటికే దీనికి `గోల్డెన్ గ్లోబ్` అవార్డు దక్కింది. `నాటు నాటు` పాటకిగానూ కీరవాణి ఈ అత్యున్నత పురస్కారం అందుకున్నారు. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక అవార్డు `ఆర్ఆర్ఆర్` కి వరించింది. ఫారెన్ లాంగ్వేజెస్ విభాగంలో ఉత్తమ చిత్రం అవార్డు దక్కింది. దీంతోపాటు `నాటు నాటు`కి మరో పురస్కారం వరించింది.
అమెరికాలోని `లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్` అవార్డు దక్కడం విశేషం. `నాటు నాటు` పాటకిగానూ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణిని ఎంపిక చేశారు. ఈ అవార్డు అందుకున్న సందర్భంగా దిగిన ఫోటోని కీరవాణి ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ తన సంతోషాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా అభిమానులు, నెటిజన్లు స్పందిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదే ఊపులో ఆస్కార్ సాధించాలని కోరుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా `ఆస్కార్` బరిలో ఉంది. `ఉత్తమ నటుడు`, ఉత్తమ దర్శకుడు, ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో ఇది ఆస్కార్ కోసం పోటీ పడుతుంది. ఈ నెలాఖరులో నామినేషన్స్ ఫైనల్ అవుతున్నాయి. ఆస్కార్కి నామినేట్ అయ్యిందంటే ఆల్మోస్ట్ ఆస్కార్ వచ్చినట్టే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రూపొందిన `ఆర్ఆర్ఆర్` చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించగా, డీవీవీ దానయ్య నిర్మించారు. అలియాభట్, అజయ్ దేవగన్, శ్రియా, ఒలివియా మోర్రీస్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా గతేడాది మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఏకంగా రూ.1200కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఇతర దేశాల్లోనూ మంచి కలెక్షన్లతో రన్ అవుతుండటం విశేషం.