దిల్ రాజు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా
ఇప్పుడు మరో వారసుడు కూడా ఇండస్ట్రీకి వస్తున్నాడు. దిల్ రాజు సోదరుడైన శిరీష్ తనయుడు ఆశీష్ రెడ్డిని హీరోగా పరిచయం చేయబోతున్నాడు ఈ నిర్మాత. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకి ‘రౌడీ బాయ్స్’ అనే టైటిల్ ఖరారు చేశారు.
దసరాకు వరస సినిమాలు రిలీజ్ లు పెట్టుకుంటున్నాయి. ఇన్నాళ్లు ఆగిన సినిమాలు అన్నీ వరస పెట్టి థియోటర్స్ లో దిగటానికి ముస్తాబు అవుతున్నాయి. దాంతో ఈ పోటీ ని గమనించిన కొందరు మధ్యలో ఇరుక్కుపోవటం ఎందుకుని ప్రక్కకు తప్పుకుంటున్నారు. అలా దిల్ రాజు కూడా తన తాజా చిత్రం అక్టోబర్ 13 రిలీజ్ ఫిక్స్ చేసుకుని కూడా ప్రక్కకు తప్పుకుంటున్నారని సమాచారం.
సినీ ఇండస్ట్రీలో వారసత్వం కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా మంది వారసులు ఇక్కడ ప్రవేశించి రాణించారు. ఇదే కోవలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. యూత్ పుల్ ఎంటర్టయినర్ గా తెరకెక్కుతున్న 'రౌడీ బాయ్స్' అనే చిత్రంతో ఆశిష్ వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలని ఫిక్స్ చేసారు. అయితే ఇప్పుడు దసరాకు ఎక్కువ సినిమాలు రిలీజ్ కు ఉండటంతో వాయిదా వేసినట్లు సమాచారం. అలాగే విశాల్ తాజా చిత్రం ఎనిమీ కూడా దసరా రిలీజ్ అనుకున్నారు. కానీ ఆ సినిమా సైతం రేసు నుంచి తప్పుకుంటోంది. అయితే కొత్త రిలీజ్ డేట్స్ ప్రకటించలేదు.
'రౌడీ బాయ్స్' సినిమాలో ఆశిష్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. హర్ష కొనుగంటి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా ఈ రౌడీ బాయ్స్ చిత్రం రూపుదిద్దుకుంటోంది.
‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఇంజినీరింగ్ స్టూడెంట్స్ నాలుగేళ్ల జర్నీ ఈ చిత్రం. రెండు కాలేజీల మధ్య జరుగుతుంది. రౌడీ బాయ్స్ గుడ్ బాయ్స్ ఎలా అయ్యారనేదే కథ. ’’ అన్నారు. అలాగే ‘ప్రేమదేశం, హ్యాపీ డేస్’ చిత్రాలు యువతను షేక్ చేశాయి. ఆశిష్తో మేం సినిమా అనుకున్నప్పుడు అలాంటి ఔట్ అండ్ ఔట్ కాలేజ్ యూత్ స్టోరీ కావాలని శ్రీహర్షను అడిగాను. తన కాలే జ్ లైఫ్లో జరిగిన సంఘటనలతో కథ రాసుకుని, ‘రౌడీ బాయ్స్’ తీశాడు’’ అన్నారు ‘దిల్’ రాజు. నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి ఆశిష్ రెడ్డి (శిరీష్ తనయుడు) హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో విక్రమ్ మరో హీరో.