సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న '2.0' చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. దీనికి తగ్గట్టుగానే..ఇండియాలోనే మొట్ట మొదటిసారి మోడ్రన్‌ టెక్నాలజీతో ముంబయిలో  ఘనంగా రోబో 2.0 ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. 

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను నవంబర్‌ 20న ముంబాయిలోని యశ్‌రాజ్‌ స్టూడియోలో సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నారు. ఇండియాలోనే ఫస్ట్‌ టైమ్‌ మోడ్రన్‌ టెక్నాలజీతో ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ కార్యక్రమాన్ని లైకా ప్రొడక్షన్స్‌ యూ ట్యూబ్‌ ఛానల్‌ https://www.youtube.com/LycaProductionsలో లైవ్‌ స్ట్రీమ్‌ చేయబోతున్నారు. 

ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, ఎమీ జాక్సన్‌, సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌, డైరెక్టర్‌ శంకర్‌, నిర్మాత సుభాష్‌కరణ్‌తోపాటు '2.0' చిత్రం యూనిట్‌ సభ్యులంతా పాల్గొంటారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న ఈ కార్యక్రమాన్ని ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ నిర్వహిస్తారు.