సుశాంత్ సంచలన వీడియో లీక్: మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలని ప్లాన్
ఈ కేసులో ప్రధానంగా సుశాంత్ ప్రియురాలిపై ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో రియా నుంచి పలు సంచలన నిజాలు బయటపడ్డాయి. రియాకి సంబంధించిన ఓ ఫోన్ కాల్ డేటా ఓ జాతీయ మీడియా బయటపెట్టింది. ఇందులో అనేక షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు అనేక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసు కాస్త సీబీఐకి వెళ్లింది. ముంబయి పోలీసులపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. బీహార్ పోలీసు అధికారిని నిర్భంధించడం, ఈ కేసులో రియా ప్రధాన నిందితురాలుగా మారడం, దిశా కేసులోనూ అనేక ట్విస్ట్ లు చోటు చేసుకోవడంతో మొత్తంగా సుశాంత్ కేసు అనేక మలుపులు తీసుకుంటుంది. గంట గంటకు కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త విషయాలు బయటపడుతున్నాయి. దీంతో పోలీసులు సైతం విస్తూ పోతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధానంగా సుశాంత్ ప్రియురాలిపై ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో రియా నుంచి పలు సంచలన నిజాలు బయటపడ్డాయి. రియాకి సంబంధించిన ఓ ఫోన్ కాల్ డేటా ఓ జాతీయ మీడియాకి దొరికింది. ఇందులో అనేక షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. రియా చాలా రోజులుగా సుశాంత్ని టార్చర్ చేస్తుందని వెల్లడైంది. ఓ జాతీయ మీడియా రియా కాల్ డేటాని బయటపెట్టింది.
గతేడాది నవంబర్ లో సుశాంత్ ఛండీఘర్లో ఉన్న తనను రియా తిరిగి రావాల్సిందిగా బ్లాక్మెయిల్ చేస్తోందని, సాయం కోసం ఫోన్ చేసినట్లు తెలిసింది. డిసెంబర్ లో మొబైల్ నంబర్ మార్చినట్టుగా జాతీయ మీడియా ఛానల్ చెప్పింది. ఈ నంబర్ నుంచి సుశాంత్ తన కుటుంబానికి ఫోన్ చేసి రియా, ఆమె కుటుంబం తనను మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలని చూస్తున్నారని, తనకు చేరడం ఇష్టం లేదని చెప్పినట్లుగా తెలిపింది. ముంబైకి గుడ్బై చెప్పి హిమాచల్ప్రదేశ్లోని ఎక్కడో ఒకచోట ఉంటానని కుటుంబ సభ్యులతో సుశాంత్ చెప్పినట్లు తెలిసింది. ఇక ఈ ఏడాది జనవరి 20 నుంచి 24 మధ్య సుశాంత్కు రియా 25 ఫోన్కాల్స్ చేసినట్లుగా వెల్లడైంది. ఐదు రోజుల వ్యవధిలో రియా అన్ని సార్లు ఫోన్ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రియా ఫోన్ చేసిన సమయంలో సుశాంత్ ఛండీగర్లో తన సోదరితో ఉన్నట్లు సమాచారం.
మరోవైపు రియా ఆస్తులు చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆమె పేరుతో ముంబయిలోని ఖర్లో రూ.85 లక్షల విలువైన ప్లాట్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంత ఖరీదైన ప్లాట్ కొనడానికి ఆమెకు డబ్బులు ఎలా వచ్చాయనే దాని గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిలో హౌస్లోన్ వాటా 60 లక్షల రూపాయలు. ప్టాట్ విస్తీర్ణం 550 చదరపు అడుగులు ఉండగా, రియా తండ్రి రిటైర్డ్ డిఫెన్స్ అధికారి పేరు మీద మరో ప్లాట్ ఉన్నట్లు ఈడీ గుర్తించింది. దీన్ని 2012లో కొనుగోలు చేసి.. 2016లో స్వాధీనం చేసుకున్నారు. 1130 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాట్ విలువ రూ.60 లక్షలు కాగా, ఇది రాయ్గఢ్ జిల్లాలోని ఉల్వేలో ఉన్నట్లు సమాచారం. అంతేకాక ఈడీ దర్యాప్తులో రియా చక్రవర్తి ఆదాయం 10 నుంచి 14 లక్షలకు పెరిగినట్లు తెలుస్తోంది. ఇంత డబ్బు ఆమెకి ఎలా వచ్చిందనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈడీ రేపటిలోగా తమ ముందు హాజరుకావాలని రియాకి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె ఇంకా స్పందించలేదు.