గుంటూరు జిల్లా పెదకాకానిలో బార్ అసోసియేషన్‌కు చెందిన కొంత మంది మహిళా న్యాయవాదులు రాంగోపాల్ వర్మతో పాటు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

‘నన్ను కించపరుస్తూ నా మనోభావాలను గాయపరిచిన ఈ అడ్వకేట్లందరి మీద కేసు పెట్టబోతున్నాను’ అని హెచ్చరించారు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ హెచ్చరించారు. అసలేం జరిగింది అనే వివరాల్లోకి వెళితే..

రీసెంట్ గా ..గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన అకడమిక్ ఎగ్జిబిషన్‌లో రాంగోపాల్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన గెస్ట్ లెక్చర్ ఇస్తూ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో తన పద్దతి ప్రకారం ఎప్పటిలానే వర్మ మాట్లాడేశారు. అవి వైరల్ అవటమే కాకుండా , వివాదాస్పదం అయ్యాయి. తాగండి..తినండీ అంటూ మధ్యలో అమ్మాయిల ప్రస్తావన కూడా వచ్చింది. దాంతో వర్మను ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా పిలిచినందుకు టీడీపీ మహిళా వర్గం ఇప్పటికే వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్‌పై దుమ్మెత్తిపోసింది. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మహిళా న్యాయవాదులు పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు.

Scroll to load tweet…
Scroll to load tweet…

అలాగే గుంటూరు జిల్లా పెదకాకానిలో బార్ అసోసియేషన్‌కు చెందిన కొంత మంది మహిళా న్యాయవాదులు రాంగోపాల్ వర్మతో పాటు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన అకడమిక్ ఎగ్జిబిషన్‌కు వచ్చిన రాంగోపాల్ వర్మ.. మహిళలను కించపరిచేలా మాట్లాడారని మహిళా న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జీవీ, వీసీ రాజశేఖర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పోలీస్ స్టేషన్ బయట మీడియాతో మాట్లాడిన మహిళా న్యాయవాదులు.. యూనివర్సిటీలో ఆర్జీవీ మాట్లాడిన తీరు మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందని అన్నారు. చదువుకునే పిల్లల ముందు రామ్ గోపాల్ వర్మ అసభ్యకరంగా మాట్లాడిన తీరు, నిలబడే తీరు కానీ చాలా అసహ్యంగా ఉందని విమర్శించారు. వర్మ మాటలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఎలా స్పందిస్తారో తమకు తెలీదు కానీ.. బార్ అసోసియేషన్ నుంచి మహిళా న్యాయవాదులుగా తాము స్పందిస్తూ పెదకాకాని సీఐకి ఫిర్యాదు చేశామని చెప్పారు. దీనిపై కేసు పెట్టి ఆర్జీవీపై తగిన చర్యలు తీసుకునేంత వరకు తమ పోరాటం ఆగదని చెప్పారు.

అయితే, మహిళా న్యాయవాదుల డిమాండ్‌పై రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తాను మాట్లాడిన స్పీచ్‌కు సంబంధించిన మొత్తం కాపీని గూగుల్ డాక్యుమెంట్‌లో సేవ్ చేసిన వర్మ.. ఆ డాక్యుమెంట్‌ను షేర్ చేస్తూ తనను కించపరిచిన, తన మనోభావాలను గాయపరిచిన లాయర్లపై కేసు పెట్టబోతున్నానంటూ బాంబ్ పేల్చారు.