`దిశ` సినిమా పేరు మార్పు.. విడుదలకు మరో రెండు వారాలుః హైకోర్ట్
రామ్గోపాల్ రూపొందించిన `దిశ` సినిమా పేరు మార్చాలని హైకోర్ట్ తెలిపింది. దీంతో సినిమా పేరుని `ఆశః ఎన్కౌంటర్`గా మార్చారు దర్శక నిర్మాతలు. `దిశ` సినిమాపై దిశ తండ్రి కోర్ట్స్ ఆశ్రయించిన విషయం తెలిసిందే.
రామ్గోపాల్ రూపొందించిన `దిశ` సినిమా పేరు మార్చాలని హైకోర్ట్ తెలిపింది. దీంతో సినిమా పేరుని `ఆశః ఎన్కౌంటర్`గా మార్చారు దర్శక నిర్మాతలు. `దిశ` సినిమాపై దిశ తండ్రి కోర్ట్స్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం విచారణ చేపట్టిన హైకోర్ట్ తుది తీర్పుని వెల్లడించింది.
ఇప్పటికే ఈ సినిమాకి ఏప్రిల్ 16న సెన్సార్ పూర్తయ్యిందని, `ఏ` సర్టిపికేట్ ఇచ్చినట్టు సెన్సార్ బోర్డ్ వెల్లడించింది. అయితే సినిమాని మరో రెండు వారాల పాటు విడుదల నిలిపివేయాలని తెలిపింది. `దిశ` సినిమా కేసు గతేడాది నుంచి హైకోర్ట్ లో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.
రెండేళ్ల క్రితం శంషాబాద్ సమీపంలో `దిశ`ని కొందరు దుండగులు రాత్రి సమయంలో అత్యాచారం చేసి హత్య చేసిన విషయంతెలిసిందే. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటన ఆధారంగా రామ్గోపాల్ వర్మ `దిశః ఎన్కౌంటర్` పేరుతో సినిమాని రూపొందించిన విషయం తెలిసిందే. వర్మ,ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించగా, నట్టి కుమార్ నిర్మించారు.