రామ్ తెలివైనోడు.. తొందరగా మేల్కొన్నాడు!
ఈ లిస్ట్ లో ఎక్కువగా వినిపిస్తున్న చిత్రం రామ్ పోతినేని చిత్రం ‘రెడ్’. మొదట అనుకున్న ప్లాన్ ప్రకారం అన్నీ అనుకున్నట్లు సాగితే ‘రెడ్’ చిత్రం ఏప్రిల్ 9న విడుదల అయ్యే అవకాసం ఉంది. కానీ కుదర లేదు. ఇప్పటికే ఈ చిత్రం టీమ్ ..టీజర్, కొన్ని సాంగ్స్ రిలీజ్ చేసింది. మిగతా ప్రమోషన్ మెటీరియల్ సైతం సిద్దం చేసింది.
మహమ్మారి కరోనా వైరస్ కారణంగా యావత్ దేశం లాక్డౌన్లోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. కరోనా ప్రభావం సినీ ఇండస్ట్రీపై భారీగా పడింది. లాక్డౌన్ నేపథ్యంలో రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ పోస్ట్ ఫోన్ అయ్యాయి. సమ్మర్ హ్యాలీడేస్ ని క్యాష్ చేసుకోవాలని టాలీవుడ్ దర్శకనిర్మాతలు భారీ ప్లాన్స్ వేసుకున్నారు. కానీ లాక్డౌన్ దెబ్బతో వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఒరేయ్ బుజ్జిగా, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, రెడ్, వి సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నా లాక్డౌన్ కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే కొన్ని చిన్న సినిమాలు డిజిటల్ ఫ్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తుండగా.. మరికొన్ని పెద్ద సినిమాల దర్శకనిర్మాతలు, హీరోలు ఓటీటీ ప్లాట్ఫాంపై రిలీజ్ చేసేందుకు ససిమేరా ఒప్పుకోవటం లేదంటూ వార్తలు వస్తున్నాయి. ఈ లిస్ట్ లో ఎక్కువగా వినిపిస్తున్న చిత్రం రామ్ పోతినేని చిత్రం ‘రెడ్’.
మొదట అనుకున్న ప్లాన్ ప్రకారం అన్నీ అనుకున్నట్లు సాగితే ‘రెడ్’ చిత్రం ఏప్రిల్ 9న విడుదల అయ్యే అవకాసం ఉంది. కానీ కుదర లేదు. ఇప్పటికే ఈ చిత్రం టీమ్ ..టీజర్, కొన్ని సాంగ్స్ రిలీజ్ చేసింది. మిగతా ప్రమోషన్ మెటీరియల్ సైతం సిద్దం చేసింది.అయితే సినిమా రిలీజ్ నాటికి ప్రేక్షకులలో క్యూరిటీసిటీ పోకుండా ఉండటం కోసం ప్రమోషన్స్ మళ్లీ మొదలెట్టింది. ఎగ్రిసెవ్ గా ప్రమోట్ చేయాలని ఫిక్సైనట్లు తెలుస్తోంది. ఈ రోజు ఓ సాంగ్ మేకింగ్ వీడియో వదలబోతోంది. రిలీజ్ ఎప్పుడో క్లారిటీ రాకపోయినా సైలెంట్ గా ఉంటే సినిమా కిల్ అయ్యిపోతుందని భావించి ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రమోషన్ యాక్టవిటీస్ జరగనున్నాయి.
ఇదిలా ఉంటే దర్శకనిర్మాతలు డిజిటల్ బాట వైపు మొగ్గు చూపుతున్నారని, కానీ హీరో రామ్ డైలామాలో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై రామ్ ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘అలాంటిదేం లేదు! రామ్ ఎలాంటి సందిగ్థంలో లేడు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక దూరం పాటిస్తూ, ఇంట్లోనే ఉంటున్నాడు. అభిమానులు ‘రెడ్’ సినిమాను థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు’ అని తెలిపాడు.
కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా పేతురేజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్లు హీరోయిన్లుగా నటించారు. స్రవంతి మూవీస్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్.. క్లాస్, మాస్ లుక్స్లో అదరగొట్టినట్టుగా తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్తో సత్తా చాటిన రామ్.. ఈ చిత్రంతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటాడని అభిమానులు అంటున్నారు.