మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, అభిమానులకు సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన రామ్ చరణ్
మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. చాలా కాలం నుంచి అభిమానులు ఎదురుచూస్తున్న రోజు ముందే ఉంది. ఫ్యాన్స్ కోసం సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు మెగా పవర్ స్టార్. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా..?
మెగా వారసుడిగా టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తో అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన మెగా పవర్ స్టార్.. ఆచార్య సినిమాతో కాస్త డిస్సపాయింట్ చేశాడు. ఈసారి సాలిడ్ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. అందుకే ప్రస్తుతం ఆయన లెజెండరీ దర్శకుడు శంకర్తో RC15 చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది.
అయితే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి నెలలు గడుస్తోంది. కాని ఇప్పటి వరకూ ఈమూవీ నుంచి ఫ్యాన్స్ కోసం ఏ అప్ డేట్ ఇవ్వలేదు. అప్పుడప్పుడు షూటింగ్ మేకింగ్ ఫోటోలు.. చిన్నచిన్న వీడియోలు తప్పించి.. మూవీలో రామ్ చరణ్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు. శరవేగంగా జరుపుకుంటుంది. దాంతో మెగా అభిమానులు చిత్రబృందంపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సర్ ప్రైజింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
త్వరలో.. ఈసినిమా నుంచి సాలిడ్ అప్ డేట్ నుప్లాన్ చేస్తున్నారంట టీమ్. మెగా అభిమానులు దిల్ ఖుష్ అయ్యేలా.. మంచి అప్ డేట్ ఇ్వవబోతున్నారట. ఈ జనవరిలో.. సంక్రాంతి ని పురస్కరించుకుని రామ్చరణ్ ఫస్ట్లుక్ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట టీమ్. అంతేకాకుండా ఓ స్పెషల్ గ్లింప్స్ను కూడా ప్లాన్ చేస్తుంన్నారట టీమ్. త్వరలోనే దీనికి సబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది.
ఇక సర్కారోడు టైటిల్ ఈ సినిమాకు పరిశీలనలో ఉండగా.. ఈమూవీలో రామ్చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈసినిమాలో రామ్చరణ్కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది.ఇక హోమ్లీ బ్యూటీ అంజలి కూడా ఈమూవీలో ఇంపార్టెంట్ రోలో లో నటిస్తున్నారు. వీరితో పాటు సునీల్, దర్శకుడు ఎస్.జే సూర్య కీలకపాత్రలో నటిస్తున్నారు. పోలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు.