లోపలే బాధపడ్డారు.. కానీ ఎప్పుడూ బయటపడలేదు.. చిరంజీవిపై రవితేజ ఎమోషనల్ కామెంట్స్
చిరంజీవిపై ఎమోషనల్ కామెంట్స్ చేశారు మాస్ మహారాజా రవితేజ. `వాల్తేర్ వీరయ్య` ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ చిరంజీవితో జర్నీని వెల్లడించారు.
`అన్నయ్య` సినిమాలో చిరంజీవికి తమ్ముడిగా నటించారు రవితేజ. ఆ తర్వాత హీరోగా ఎదిగి మాస్ మహారాజాగా ఓ స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. తిరుగులేని స్టార్గా రాణిస్తున్న రవితేజ ఇప్పుడు చిరంజీవితో కలిసి నటించారు. `వాల్తేర్ వీరయ్య`లో రవితేజ కీలక పాత్రలో నటించారు. తాజాగా తన జర్నీని, చిరంజీవి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు రవితేజ. వైజాగ్లో జరుగుతున్న `వాల్తేర్ వీరయ్య` ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ మాట్లాడుతూ,
విజయవాడ నుంచి అన్నయ్య(చిరంజీవి)తో జర్నీ స్టార్ట్ అయ్యిందన్నారు. ఆ సమయంలో విజయవాడలో `విజేత` ఫంక్షన్ జరుగుతుందని, చిరంజీవి పక్కన కోదండరామిరెడ్డి, భానుప్రియ కూర్చొన్నారు. అప్పుడు తాను ఎక్కడో జనంలో ఫ్రెండ్స్ తో ఉన్నానని, ఆ రోజు నిర్ణయంచుకున్నాడట ఏదో ఒక రోజు ఆ పక్క సీట్లో తాను కూర్చుంటానని, అలా ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేశాను, తమ్ముడి పాత్రని చేశాను, ఇప్పుడు అన్నయ్యతో కలిసి నటించాను అని `వాల్తేర్ వీరయ్య`ని గుర్తు చేశారు రవితేజ.
ఇప్పుడు పక్కన కూర్చొవడం కాదు, ఆల్మోస్ట్ చంకెక్కి కూర్చున్నానని తెలిపారు. అనుకున్నదానికంటే ఎక్కువే దక్కరయ్యానని చెప్పారు. నన్ను ఎంతో ప్రేమించారని, ఎంకరేజ్ చేశారని చెప్పారు. చిరంజీవిగారు ఎవరు ఎన్ని అన్నా తిరిగి ఎవరిని ఒక్క మాటకూడా అనలేదు. ఒక్కరి గురించి నెగిటివ్గా మాట్లాడినట్టు నేను వినలేదన్నారు. అంతటి పాజిటివ్ పర్సన్ అన్నయ్య అని తెలిపారు. ఇప్పటికే తొమ్మిదేళ్లు మిస్ అయ్యామని ఇక మిస్ కావద్దని తెలిపారు.
దర్శకుడు బాబీ గురించి చెబుతూ, `బలుపు` సినిమాతో పరిచయం అయ్యారని `పవర్` కొట్టేశాడని తెలిపారు. ఈ సినిమాతో ఆల్రెడీ సూపర్ హిట్ కొట్టాడని, దీంతో నెక్ట్స్ లెవల్ దర్శకుడు అయిపోతాడని తెలిపారు. నిర్మాతలకు అభినందనలు తెలిపారు రవితేజ. ఇక సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయిందని, సక్సెస్ సెలబ్రేషన్లో కలుద్దామని తెలిపారు.