‘మహాసముద్రం’లోకి దూకుతున్న రవితేజ?
ఆర్ఎక్స్ 100’ చిత్రంతో టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. తన తొలి చిత్రం ఘన విజయం సాధించటంతో రెట్టించిన ఉత్సాహంతో తన రెండవ సినిమాకు ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కథ రాసుకున్నారు.
ఒక హీరోతో అనుకున్న కథను రకరకాల కారణాలతో వేరే హీరోతో చేయటం, హిట్ కొట్టడం చాలా కామన్ గా జరిగే విషయం. అయితే మరీ యంగ్ హీరోలతో అనుకున్న కథను సీనియర్ హీరోలతోనూ, లేదా సీనియర్ హీరోతో అనుకున్న కుర్ర హీరోతోనూ చేయటానికి మొదలెట్టినప్పుడే అందరీకి ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు అలాంటి ఫీటే జరగబోతోందని వినికిడి. రామ్, బెల్లంకొండ శ్రీను, నితిన్ వంటి హీరోలతో చేద్దామని మొదలెట్టిన సినిమా ఒకటి ఇప్పుడు రవితేజతో ఫైనల్ చేయబోతున్నట్లు వినికిడి.
వివరాల్లోకి వెళితే...‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. తన తొలి చిత్రం ఘన విజయం సాధించటంతో రెట్టించిన ఉత్సాహంతో తన రెండవ సినిమాకు ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కథ రాసుకున్నారు.
‘మహాసముద్రం’ అనే టైటిల్ తో అనకున్న ఈ కథను మొదట అక్కినేని నాగచైతన్యతో చేద్దాం అనుకున్నారు. బడ్జెట్ ఎడ్జెస్ట్ లతో ఆగింది. తర్వాత రామ్ తో అనుకున్నా.. కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తో ఆఫీస్ ఓపెన్ చేసారు కానీ అదీ ముందుకు వెళ్లలేదు. కారణాలు ఏంటనేది ప్రక్కన పెడితే ఇప్పుడు అజయ్ భూపతి ..రవితేజ ని కలిసి కథ వినిపించి ఓకే చేసుకున్నట్లు సమాచారం.
సరైన సాలీడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఈ కథ బాగా నచ్చిందని వినికిడి. ప్రస్తుతం విఐ ఆనంద్ డైరెక్షన్లో ‘డిస్కో రాజా’ సినిమా చేస్తున్నాడు రవితేజ. మరి ఈ సినిమా తర్వాత అజయ్ భూపతి చేసే అవకాసం ఉందంటున్నారు.