Asianet News TeluguAsianet News Telugu

"జాతిరత్నాలు" డైరక్టర్ తదుపరి సినిమాలో రష్మిక మందన

ఈ చిత్రంలో హీరోయిన్ గా క్రేజీ బ్యూటీ రష్మిక మందన ఎంపికైనట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

Rashmika to star in Jathi Ratnalu directors next? jsp
Author
Chennai, First Published Jul 30, 2021, 9:01 AM IST

 తెలుగులో జాతిరత్నాలు ఫుల్ లెంగ్త్ కామెడీ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అనుదీప్ తన మొదటి చిత్రంతోనే 50 కోట్లు కలెక్షన్స్ సాధించి రికార్డులు సృష్టించారు. జాతి రత్నాలు చిత్రంతో దర్శకుడిగా మంచి క్రేజ్ సంపాదించుకున్న అనుదీప్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే "జాతిరత్నాలు" సినిమా తర్వాత కామెడీ లవ్ స్టోరీ కథను సిద్ధం చేసుకున్న అనుదీప్ శివకార్తికేయన్ కి కథ వినిపించాడని దానికి శివకార్తికేయన్ కూడా ఓకే చెప్పాడని తెలుస్తుంది. శివకార్తికేయన్, అనుదీప్ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఎల్ ఎల్ పి సంస్థ నిర్మించనుంది.

 "డాక్టర్" చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న శివకార్తికేయన్ ఈ సినిమా షూటింగ్ తర్వాత అటు డాన్ చిత్రంతో పాటు అనుదీప్ దర్శకత్వంలో రాబోయే సినిమాలో నటించబోతున్నాడు. అతి త్వరలో అనుదీప్-శివకార్తికేయన్ ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే...ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపిక అయ్యిందని వినపడుతోంది.

ఈ చిత్రంలో హీరోయిన్ గా క్రేజీ బ్యూటీ రష్మిక మందన ఎంపికైనట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ చిత్రాన్ని దర్శకుడు అనుదీప్ తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కించనున్నాడు. రష్మిక టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది. తమిళంలోకి కూడా రష్మిక కార్తీ నటించిన సుల్తాన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. త్వరలోనే ఈ ఆసక్తికర ప్రాజెక్ట్ పై మరిన్ని వివరాలు రానున్నాయి. 

శివకార్తికేయన్ తమిళంలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. రెమో, సీమరాజా, హీరో వంటి తెలుగు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన శివకార్తికేయన్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో విడుదల చేయనున్నారని సమాచారం. రష్మిక వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. సుకుమార్ తో పుష్ప, శర్వానంద్ ఆడాళ్లు మీకు జోహార్లు చిత్రాలు చేస్తోంది. 

ఇక తమిళ హీరోలు ప్రస్తుతం తెలుగు దర్శకులతో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇళయదళపతి విజయ్, వంశీ పైడిపల్లి కాంబోలో ఓ చిత్రానికి చర్చలు జరుగుతున్నాయి. క్రేజీ హీరో ధనుష్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios