Asianet News TeluguAsianet News Telugu

ఆడవాళ్లు మీకు జోహార్లు... శర్వానంద్ చిత్రంలో ముగ్గురు సీనియర్ హీరోయిన్స్


చాలా కాలం తరువాత రాధిక, ఊర్వశి తెలుగు స్ట్రెయిట్ తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. ఈ ముగ్గురు సీనియర్ హీరోయిన్స్ రాకతో ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి.

rashika urvashi kushboo on board for aadavallu meeku joharlu
Author
Hyderabad, First Published Aug 3, 2021, 12:49 PM IST

హీరో శర్వానంద్, రష్మిక మందాన జంటగా తెరకెక్కుతుంది ఆడవాళ్లు మీకు జోహార్లు. దర్శకుడు కిషోర్ తిరుమల రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీపై క్రేజీ అప్డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్. సీనియర్ హీరోయిన్స్ రాధిక, కుష్బూ, ఊర్వశి ఈ చిత్రంలో నటిస్తున్నట్లు పోస్టర్స్ విడుదల చేశారు. 

చాలా కాలం తరువాత రాధిక, ఊర్వశి తెలుగు స్ట్రెయిట్ తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. ఈ ముగ్గురు సీనియర్ హీరోయిన్స్ రాకతో ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. రాధిక, కుష్బూ, ఊర్వశిలతో శర్వానంద్ సందడి స్క్రీన్ పై పండడం ఖాయంగా కనిపిస్తుంది. ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పై పరిశ్రమలో పోజిటివ్ బజ్ ఉంది. 


సరైన హిట్స్ లేక అల్లాడుతున్న శర్వానంద్ కి లక్కీ లేడీగా పేరున్న రష్మిక హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి. మరో వైపు శర్వానంద్ హీరోగా మహా సముద్రం తెరకెక్కుతుంది. సిద్దార్థ్ మరో హీరోగా నటిస్తున్న మహా సముద్రం చిత్రానికి ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios