రామ్ సినిమాకు లీగల్ ట్రబుల్స్,చరణ్ కు వచ్చినట్లే
‘ఇండియన్-2’ సంగతేంటో తేల్చకుండా శంకర్ వేరే సినిమా చేయడానిక వీల్లేదంటూ దాని నిర్మాతలైన లైకా ప్రొడక్షన్స్ అధినేతలు కోర్టుకు ఎక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సేమ్ టు సేమ్ రామ్ సినిమాకూ అలాంటి సమస్య ఎదురైంది.
వివాదాలు లేనిదే సినిమాలు మొదలు కావటం లేదు. పూర్తవటం లేదు అన్న పరిస్దితి అన్ని చోట్లా ఉంది. ముఖ్యంగా తమిళ సినిమా పూర్తిగా వివాదాలతో నిండిపోయింది. ఆ తమిళ దర్శకులతో తెలుగు హీరోలు చేద్దామంటే లీగల్ సమస్యలు వచ్చిపడుతున్నాయి. మొన్న టికి మొన్న రామ్ చరణ్ ,శంకర్ కాంబినేషన్ సినిమాకు నిర్మాతల నుంచి సమస్య వచ్చింది. తాము మొదలెట్టిన ‘ఇండియన్-2’ సంగతేంటో తేల్చకుండా శంకర్ వేరే సినిమా చేయడానిక వీల్లేదంటూ దాని నిర్మాతలైన లైకా ప్రొడక్షన్స్ అధినేతలు కోర్టుకు ఎక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సేమ్ టు సేమ్ రామ్ సినిమాకూ అలాంటి సమస్య ఎదురైంది.
వివరాల్లోకి వెళితే... రామ్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా డైరెక్టర్ లింగుస్వామికి చిక్కులు ఎదురయ్యాయి. కోలీవుడ్కు చెందిన ప్రముఖ నిర్మాత జ్ఞాన్వేల్ రాజా ఆయనపై తెలుగు నిర్మాతల మండలికి, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్కు ఫిర్యాదు చేశారు. తనకు చెందిన స్టూడియో గ్రీన్ బ్యానర్లో ఓ ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తానని మాటిచ్చి, లింగుస్వామి భారీగా డబ్బులు తీసుకున్నారని ఆయన ఆరోపించారు.
‘స్టూడియో గ్రీన్ బ్యానర్లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తానని లింగుస్వామి గతంలో నాకు మాటిచ్చారు. మాట ప్రకారమే నా వద్ద నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బు కూడా తీసుకున్నారు. ఇప్పటివరకూ మా బ్యానర్పై ఎలాంటి చిత్రాన్ని ఆయన ఓకే చేయలేదు. అంతేకాకుండా, ఇప్పుడు ఆయన రామ్తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. మా డిమాండ్ ఒక్కటే.. లింగుస్వామి ముందు మా బ్యానర్లో సినిమా చేయాలి. ఆ తర్వాతే కొత్త ప్రాజెక్టులోకి వెళ్లాలి. ఆయన రామ్తో సినిమా చేయడంపై మాకెలాంటి సమస్య లేదు’ అని జ్ఞాన్వేల్ వివరించారు.
ఇక రామ్ , లింగు స్వామి చిత్రానికి శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాణ సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. లింగు స్వామీ ఇప్పటికే ఆవారా, సికిందర్ వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. మరి రామ్తో అతడు ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. మరో ప్రక్క రామ్ ఇప్పటికే వెంకీ కుడుముల చెప్పిన ప్రేమకథను రిజెక్ట్ చేశారు. దాంతో రామ్ తన తదుపరి చిత్రంగా పక్కా మాస్ సబ్జెక్టుని ఎంచుకుంటారని తెలుస్తోంది.