దీపికా పదుకొనెతో విడాకులపై స్పందించిన రణ్ వీర్ సింగ్, ఎమన్నాడంటే...?
గత కొన్ని రోజులుగా వస్తున్న విడాకుల వార్తలపై స్పందించాడు రణ్ వీర్ సింగ్. అయితే డైరెక్ట్ గా ఆయన ఏం మాట్లాడలేదు. ఇండైరెక్ట్ గా ట్రోలర్స్ ముఖం మీద కొట్టినట్టు సమాధానం చెప్పాడు. ఇంతకీ ఆయన ఏమన్నారు.
ఈమధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో విడాకులు కామన్ అయిపోయాయి. ముఖ్యంగా సినిమా బ్యాక్ గ్రౌండ్ తో పెళ్లిళ్లు చేసుకున్నవారు వరుసగా విడాకులు తీసుకోవడంతో.. ఇక చాలా మంది స్టార్టు విడాకులకు రెడీగా ఉన్నారంటూ.. సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో స్టార్ కపుల్స్ పై ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా విడాకులు వార్తలు వండి వడ్డిస్తున్నారు జనాలు. ఈ క్రమంలోనే బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ రణ్ వీర్ సింగ్, దీపికా పదుకునే పై కూడా ఈ మధ్య రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో రూమర్స్ గుప్పుమన్నాయి.
బాలీవుడ్ జంటలలో కాస్త డిఫరెంట్ గా కనిపించేది మాత్రం రణ్ వీర్ సింగ్ - దీపికా పదుకొనేలే. చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈజంట చాలా మందికి ఆదర్శంగా ఉంటారు. ఎవరి పని వారు చూసుకుంటారు. ఒకరికి ఇంకొకరు ప్రైవసీ ఇచ్చుకుంటారు. భార్య భర్తలు అయినా.. క్లోజ్ ఫ్రెండ్స్ లా మూవ్ అవుతారు. అటువంటి వారు విడాకులుతీసకుంటున్నారు అంటే జనాలు ఎవరూ నమ్మడం లేదు. ఇక ఈ విషయంలో స్పందించారు రణ్ వీర్ సింగ్.
ఈ మధ్య ఈ ఇద్దరు స్టార్ల మ్యారేజ్ లైఫ్ గురించి రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి.వీరి వివాహ బంధం గురించి కొన్ని పుకార్లు షికారు చేశాయి. ఒకరంటే మరొకరికి పడటం లేదని, ఈ ఇద్దరూ తొందర్లోనే విడాకులు తీసుకోబోతున్నారని కొన్ని వారాలుగా బాలీవుడ్లో వినిపిస్తున్నాయి. అయితే, సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు తమ ప్రేమను చూపిస్తూ ఈ వార్తలను రణ్వీర్, దీపిక ఖండిస్తూనే ఉన్నారు. అయినా అవి అగడం లేదు. తాజాగా రణ్ వీర్ ఈ పుకార్లకు మరోసారి పుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు.
తన భార్య దీపికను మై క్వీన్ అంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టాడు. అందరి నోర్లు మూయించే ప్రయత్నం చేశాడు రణ్ వీర్. దీపిక ఈ మధ్యే జ్యూయల్లరీ, వాచ్ మాన్యూఫ్యాక్చరింగ్ బ్రాండ్ కార్టియర్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైంది. ఈ విషయాన్ని కార్టియర్ ట్విట్టర్ ద్వారా పంచుకుంది. దీనికి రణ్వీర్ స్పందించాడు. ఆ ట్వీట్ కు కింద కామెంట్ పెట్టాడు. మై క్వీన్ నాకు చాలా గర్వంగా ఉంది" అని కామెంట్ పెట్టాడు. దాంతో, ఈ జంట విడిపోతుందన్న పుకార్లకు మరోసారి చెక్ పెట్టినట్టయింది.
ఈ ట్వీట్ తో అయినా.. అలాంటి వార్తలు ఆగుతాయో లేదో చూడాలి. బాలీవుడ్లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న దంపతుల్లో రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొణె జంట ముందుంటుంది. చాలా ఏళ్లు ప్రేమించుకున్న ఈ జంట కొన్నేళ్ల క్రితం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత కూడా కెరీర్ లో బిజీగా ఉన్నారు. నటులుగా ఇద్దరూ మంచి స్పీడుతో దూసుకెళ్తున్నారు. వరుస సినిమాలతో హడావిడి చేస్తున్నారు.