రానా కర్చీఫ్ వేసేసాడు..మిగతా వాళ్లే ఆలస్యం
రానా దగ్గుబాటి టైటిల్ పాత్రలో నటించినచిత్రం `అరణ్య`. ఏప్రిల్ 2న ఈ సినిమాను ను ఈరోస్ ఇంటర్నేషనల్ తెలుగు సహా హిందీ భాషలో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కోవిడ్ ప్రభావంతో సినిమా విడుదల ఆగింది. దాదాపు ఆరేడు నెలలు వరకు థియేటర్స్ మూత పడ్డాయి. ఈ అక్టోబర్ 15న థియేటర్స్ను ఓపెన్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.
కరోనా ఉన్నా మరొకటి ఉన్నా వచ్చే సంక్రాంతికి థియోటర్స్ లో సినిమాలు రిలీజ్ అవటం ఖాయం అని క్లారిటీ వచ్చేసింది. దాంతో చాలా తెలుగు నిర్మాతలు తమ సినిమాలు సంక్రాంతి రిలీజ్ కు రెడీ చేసుకుంటున్నారు. ప్రొడక్షన్ లో ఉన్నవి, పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నవి స్పీడప్ అవుతన్నాయి. ఈ క్రమంలో ఈ యేడాదంతా పెద్ద సినిమాలు రిలీజ్ లేకపోవటంతో అవన్నీ పండగకు క్యూ కట్టనున్నాయి. ఈ క్రమంలో ఓ అడుగు ముందే ఉన్నాడు దగ్గుపాటి రానా. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న తమ సినిమా అరణ్య సంక్రాంతికి వచ్చేస్తుందని చెప్పేసాడు. దాంతో మిగతావాళ్లు కంగారుపడాల్సిన సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది.
రానా దగ్గుబాటి టైటిల్ పాత్రలో నటించినచిత్రం `అరణ్య`. ఏప్రిల్ 2న ఈ సినిమాను ను ఈరోస్ ఇంటర్నేషనల్ తెలుగు సహా హిందీ భాషలో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కోవిడ్ ప్రభావంతో సినిమా విడుదల ఆగింది. దాదాపు ఆరేడు నెలలు వరకు థియేటర్స్ మూత పడ్డాయి. ఈ అక్టోబర్ 15న థియేటర్స్ను ఓపెన్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.
'నిరీక్షణ ముగిసింది.. 2021 సంక్రాంతికి మీ దగ్గరలోని థియేటర్స్లో అరణ్య ' అంటూ రిలీజ్ టీజర్ను షేర్ చేశారు రానా. ప్రభుసాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విష్ణువిశాల్ కీలక పాత్రను పోషించారు. అస్సాంలోని నిజ ఘటనలతో తెరకెక్కిన చిత్రమిది. జాదవ్ ప్రియాంక్ అనే వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించామని చిత్ర యూనిట్ తెలియజేసింది. మరో ప్రక్క సంక్రాంతికి పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్', నితిన్ 'రంగ్ దే' బెల్లంకొండ శ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్' వంటి చిత్రాలు విడుదల కానున్నట్టు తెలుస్తోంది.