Asianet News TeluguAsianet News Telugu

కేక పెట్టించిన శ్రీముఖి, బాబా .. ఎలిమినేషన్ లో స్వీట్ షాక్!

కింగ్ నాగార్జున బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు ఫ్యామిలీతో వెకేషన్ వెళ్లారు. దీనితో నాగార్జున ఈ వీకెండ్ బిగ్ బాస్ షోకి దూరమయ్యారు. నాగ్ స్థానంలో ఆయన లక్కీ హీరోయిన్ రమ్య కృష్ణ తాత్కాలిక హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. తన హోస్టింగ్ తో శనివారం రోజు రమ్య కృష్ణ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 

Ramya Krishna gives sweet shock in elimination process
Author
Hyderabad, First Published Sep 1, 2019, 10:58 PM IST

కింగ్ నాగార్జున బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు ఫ్యామిలీతో వెకేషన్ వెళ్లారు. దీనితో నాగార్జున ఈ వీకెండ్ బిగ్ బాస్ షోకి దూరమయ్యారు. నాగ్ స్థానంలో ఆయన లక్కీ హీరోయిన్ రమ్య కృష్ణ తాత్కాలిక హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. తన హోస్టింగ్ తో శనివారం రోజు రమ్య కృష్ణ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 

ఆదివారం రోజు కూడా రమ్యకృష్ణ మరింత జోష్ తో కనిపించారు. రమ్యకృష్ణ హౌస్ మేట్స్ కి ఇచ్చిన 'సీన్ చేయండి' టాస్క్ ఈ ఎపిసోడ్ కే హైలైట్ అని చెప్పొచ్చు.  ఇది సభ్యులలో ఒక్కో జంటని పిలిచి ఫేమస్ చిత్రాలలోని సన్నివేశాలని చెప్పి అలా నటించాలని చెప్పారు. ముందుగా అలీ, రవికృష్ణ సీతమ్మవాకిట్లో సిరిలమల్లే చెట్టు చిత్రంలో మహేష్ బాబు పూలకుండీని తన్నే సన్నివేశంలో నటించారు. ఈ సీన్లో అలీ మహేష్ బాబుగా, రవి వెంకీగా నటించారు. 

ఇక హిమజ, మహేష్ , శివజ్యోతి కలసి రంగస్థలం చిత్రంలో ఓ సన్నివేశంలో నటించారు. రంగస్థలం చిత్రంలో సమంత తన పొలానికి నీళ్ళేయాలని రాంచరణ్, అనసూయని అడిగే సీన్ అది. మహేష్ రాంచరణ్ గా, శివజ్యోతి రంగమ్మత్తగా, హిమజ సమంతలా నటించారు. 

బాబా భాస్కర్, శ్రీముఖి చంద్రముఖి చిత్రంలో రజినీకాంత్, జ్యోతిక పాత్రల్లో నటించారు. ఈ టాస్క్ లో హైలైట్ గా నిలిచిన సీన్ ఇదే. శ్రీముఖి, బాబా భాస్కర్ కు ఈ సీన్ లో అత్యధిక మార్క్స్ వచ్చాయి. ఈ టాస్క్ లో శ్రీముఖిపై బాబా తనదైన శైలిలో సెటైర్లు వేసారు. శ్రీముఖి చంద్రముఖిలా నటిస్తుంటే ఓవరాక్షన్ చేయకు  అంటూ బాబా చెప్పడం నవ్వులు పూయించింది. 

పునర్నవి, రాహుల్ జోడి ఖుషి చిత్రంలో పవన్ కళ్యాణ్, భూమిక మధ్య సాగే నడుము సీన్ లో నటించారు. ఇక వరుణ్, వితిక దంపతులు ఎఫ్ 2 చిత్రంలో వెంకీ, తమన్నాగా నటించారు. చీటికీ మాటికీ అలిగే భార్యగా వితిక బాగా నటించింది. బిగ్ బాస్ కు వచ్చాక ఒక ముద్దు ముచ్చట లేదు అని అడగగా.. అలాంటివి ఇక్కడ చేస్తే బాగోదు అని వరుణ్ సమాధానం ఇవ్వడం నవ్వులు తెప్పించింది. 

ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే.. మహేష్, పునర్నవి, హిమజ నామినేషన్ లో ఉన్నారు. రమ్యకృష్ణ కొన్ని బ్లాక్ రొసెస్ తెప్పించి వాటినినామినేషన్ లో లేని సభ్యులకు ఇచ్చారు. ఆ రొసెస్ ని నామినేషన్ ఉన్న సభ్యులలో ఒకరికి ఇంటి సభ్యులు ఇవ్వాల్సి ఉంటుంది. నామినేషన్ లో ఉన్నవారిలో ఎవరు ఇంట్లో ఉండకూడదు అని భావిస్తే వారికి బ్లాక్ రోస్ ఇవ్వాలి. అలా ఇంటి సభ్యులు ఎక్కువగా మహేష్ కి రొసెస్ ఇచ్చారు. 

మహేష్ కి నాలుగు రోజాలు.. పునర్నవి, హిమజకు చెరో రెండు వచ్చాయి. కానీ ఆడియన్స్ మాత్రం మహేష్ కే ఎక్కువగా ఓట్లేశారని రమ్యకృష్ణ చెప్పింది. మహేష్ సేవ్ అవుతున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత రమ్య ఇంట్లోకి ప్రవేశించి హోస్ మేట్స్ ని ఆశ్చర్యపరిచారు. కాసేపు వారితో సరదాగా ముచ్చటించారు. సోమవారం రోజు వినాయక చవితి కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ లేదంటూ స్వీట్ షాక్ ఇచ్చారు. దీనితో హిమజ, పునర్నవి కూడా సేవ్ అయినట్లు అయింది. వచ్చేవారం మళ్ళీ నాగార్జున హోస్ట్ గా వస్తారని చెప్పి రమ్యకృష్ణ ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios