ఈ సినిమాలో రామ్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పోలీస్‌ రోల్‌లో రామ్‌ చేయలేదు. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.


ఎప్పుడైతే ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదలైందో.. అప్పట్నుంచే రామ్ తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. రామ్‌ పోతినేని హీరోగా తమిళ స్టార్‌ డైరెక్టర్‌ లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కృతీ శెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా'ది వారియర్‌' అనే టైటిల్‌ను ఖరారు చేసి పోస్టర్ వదిలితే మంచి రెస్పాన్స్ వచ్చింది. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది.

అందుతున్న సమాచారం మేరకు జూలై 1, 2022 న తెలుగు,తమిళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేయటానికి విడుదల తేదీని ఫిక్స్ చేసారు. ఈ చిత్రంలో మరోసారి విలనిజం చూపించనున్నాడు ఆది పినిశెట్టి. సరైనోడు తర్వాత రెండోసారి పూర్తి స్థాయి విలన్ పాత్రలో నటించనున్నాడు. రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పోస్టర్ రిలీజ్ తర్వాత మంచి క్రేజ్ వచ్చింది.

ఈ సినిమాలో రామ్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పోలీస్‌ రోల్‌లో రామ్‌ చేయలేదు. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

లింగుస్వామి సినిమాతో తమిళంలో కూడా మార్కెట్ ఓపెన్ చేసుకోవాలని చూస్తున్నాడు రామ్. అందుకే ఆయనకు ఓకే చెప్పాడు. ఈ మధ్య కాలంలో లింగుస్వామికి కూడా సరైన హిట్ లేదు. ఇలాంటి సమయంలో ఈయనతో సినిమా చేస్తున్నాడు. రామ్ కెరీర్‌కు కూడా ది వారియర్ కీలకంగా మారింది.