అఖిల్ మాజీ ప్రేయసి పెళ్లి వేడుకలు.. చరణ్,ఉపాసనలే స్పెషల్ ఎట్రాక్షన్!
అక్కినేని అఖిల్ తో నిశ్చితార్ధం జరిగిన తరువాత కొన్ని కారణాల వలన పెళ్లి
అక్కినేని అఖిల్ తో నిశ్చితార్ధం జరిగిన తరువాత కొన్ని కారణాల వలన పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది శ్రియా భూపాల్. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే మనవరాలు అయిన శ్రియా పెళ్లి క్యాన్సిల్ అయిన కొన్ని రోజులకే అనిందిత్ రెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. చరణ్ భార్య ఉపాసన పిన్ని సంగీతారెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డిల కుమారుడే ఈ అనిందిత్. చరణ్ కు బావమరిది అన్నమాట. రీసెంట్ గా శ్రియా, అనిందిత్ ల వివాహం జరిగింది. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ పారిస్ లో జరుగుతున్నాయి. ఈ వేడుకలో చరణ్-ఉపాసనలే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. వీరితో పాటు మరికొందరు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.