Asianet News TeluguAsianet News Telugu

త్వరలో కర్నూల్ కు రామ్ చరణ్, కొండారెడ్డి బురుజు దగ్గర RC15 కోసం సన్నాహాలు

రామ్ చరణ్ ‌- శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా  షూటింగ్ ఆమధ్య కాస్త స్లో అయినా.. ప్రస్తుతం పరుగెడుతోంది. దాదాపు చివరిదశకు వచ్చింది మూవీ..ఇక తాజాగా టీమ్ తో పాటు కర్నూల్ లో దిగాడు రామ్ చరణ్. 

Ram Charan Rc15 Movie Shooting in Kurnool
Author
First Published Dec 28, 2022, 4:34 PM IST

పాన్ ఇండియా స్టార్ గామారిన మెగా పవర్ స్టార్ కు ఆచార్య తో నిరాశ ఇక ఈసారి సాలిడ్ హిట్ సాధించి ప్యాన్స్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు రామ్ చరణ్ . సౌత్ లెజండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో 15 సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీ కోసం మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్‌ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే చరణ్ లుక్స్ లీక్ అయ్యి.. అభిమానులలో ఇంకా క్యూరియాసిటీని పెంచేశాయి. 

చరణ్ సినిమా కోసం తగతహలాడిపోతున్నారు ఫ్యాన్స్.. ఈక్రమంలో ఈమూవీ నుంచి ఏ అప్ డేట్ వచ్చినా అది వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలోనే ఈ సినిమానుంచి వరుసగా ఏదో ఒక అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. రీసెంట్ గా  రాజమండ్రిలో కీలక షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈమూవీ కర్నూల్‌లో  బిగ్‌ షెడ్యూల్‌ కు రెడీ అవుతుంది. రాజమండ్రిలో రాజకీయ సభకు సబంధించిన సీన్స్ ను షూట్ చేయగా.. దానికి సబంధించిన  ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఇక కీలక  షెడ్యూల్‌  కోసం కర్నూల్ వెళ్లనున్నారు టీమ్.. అక్కడ  కొండారెడ్డి బురుజు దగ్గర చరణ్‌పై  ఇంపార్టెంట్ సీన్స్ ను షూట్ చేయబోతున్నట్ట తెలుస్తోంది. అంతే కాదు ఇక్కడ చిత్రీకరించే సన్నివేశాలు సినిమాకే హైలెట్ అయ్యేలా ఉంటాయంటున్నారు టీమ్. ప్రస్తుతం ఈ షెడ్యూల్ కు సబంధించిన సన్నాహాలు పూర్తి అయినట్టు తెలుస్తోంది. న్యూ ఇయర్ సెలబ్రెషన్స్ అయిపోగానే..జనవరి మొదటి వారంలోనే ఈ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ అవుతుందని సమాచారం. అంతే కాదు ఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యేలోపు ఫ్యాన్స్ కు భారీ ట్రీట్ కూడా రెడీ చేస్తున్నట్టు సమాచారం. 

చాలా కాలంగా రామ్ చరణ్ సినిమా నుంచి అప్ డేట్ రిలీజ్ చేయకపోవడంతో.. మెగా ఫ్యాన్స్ బాగా కోపంగా ఉన్నారు. దాంతో మెగా ఫ్యాన్స్‌ను దిల్ ఖుష్ చేసేందుకు సంక్రాంతి కానుకగా.. ఆర్‌సీ15 నుంచి చరణ్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాకు సర్కారోడు  టైటిల్‌ను పరిశీలనలో ఉంచారు. చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ  కియారా అద్వానీ నటిస్తుండగా.. సునీల్‌, శ్రీకాంత్‌, అంజలీ, ఎస్‌.జే సూర్య కీలకపాత్రల్లో నటిస్తున్నారు. థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు  భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios