Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ భారీ థియేటర్.. ప్రారంభించిన రామ్ చరణ్!

ప్ర‌భాస్ సొంత సంస్థ‌ యూవీ క్రియేష‌న్స్ సూలూరు పేట‌లో ఓ మ‌ల్టీప్లెక్స్‌ని నిర్మించింది. దానికి వీ – ఎపిక్ అనే పేరు పెట్టారు. ఈనెల 29న ఈ మ‌ల్టీప్లెక్స్‌ని ప్రారంభించ‌నున్నారు. 30 నుంచి ఈ థియేట‌ర్లో సాహో ప్ర‌ద‌ర్శిస్తారు. 
 

ram charan launched prabhas's v epiq theatre
Author
Hyderabad, First Published Aug 29, 2019, 3:13 PM IST

ప్రభాస్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన యువి క్రియేషన్స్ వారితో కలిసి ఓ థియేటర్ ని నిర్మించిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరు పేటలో 'వి ఎపిక్' పేరుతో ఈ 
మల్టీప్లెక్స్ ని నిర్మించారు. సౌత్ ఏషియాలోనే ఇంత పెద్ద స్క్రీన్ ఉన్న థియేటర్ లేదు. 

అలాగే లేటెస్ట్ డాల్బీ ఆట్మస్ సౌండ్ ఎక్విప్మెంట్ తో ఉంది. ఈ మ‌ల్టీప్లెక్స్ కోసం దాదాపు 60 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ మ‌ల్టీప్లెక్స్‌లో మొత్తం మూడు స్క్రీన్‌లున్నాయి. స్క్రీన్ 1, స్క్రీన్ 2 లు 140 సిట్టింగ్ కెపాసిటీతో నిర్మించారు.

స్క్రీన్ 3 మాత్రం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌బోతోంది.దీని సిట్టింగ్ కెపాసిటీ 645. స్క్రీన్ ఎత్తు దాదాపు 100 అడుగులు. గురువారం ఈ మల్టీప్లెక్స్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ లాంఛనంగా ప్రారంభించారు. చరణ్ ని చూడడానికి అభిమానులు వేల సంఖ్యలో థియేటర్ కి చేరుకున్నారు.

ఈ సందర్భంగా చరణ్.. అభిమానులు ఉద్దేశిస్తూ స్పీచ్ ఇచ్చారు. ప్రభాస్ కి 'సాహో' మంచి సక్సెస్ అవుతుందని చెప్పారు.  శుక్రవారం విడుదల కానున్న సాహో చిత్రం ప్రదర్శనతో ఈ థియేటర్‌ ప్రేక్షకులకు కనువిందు చేయనుంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios