మంగళవారం రోజు విడుదల చేసిన టీజర్ తో మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్ర సందడి మొదలయింది. టీజర్ అద్భుతంగా ఉండడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. టీజర్ లాంచ్ సందర్భంగా సైరా నరసింహారెడ్డి చిత్ర యూనిట్ ముంబైలో మీడియా సమావేశం నిర్వహించింది.
మంగళవారం రోజు విడుదల చేసిన టీజర్ తో మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్ర సందడి మొదలయింది. టీజర్ అద్భుతంగా ఉండడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. టీజర్ లాంచ్ సందర్భంగా సైరా నరసింహారెడ్డి చిత్ర యూనిట్ ముంబైలో మీడియా సమావేశం నిర్వహించింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళీ భాషల్లో సైరా చిత్రం అక్టోబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో రాంచరణ్ కు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మీరు ఎందుకు బాలీవుడ్ చిత్రాలకు దూరంగా ఉంటున్నారు.. మిమ్మల్ని బాలీవుడ్ లో కూడా చూడాలనుకుంటున్నాం అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. నేనేమి దూరంగా ఉండడం లేదు. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నా. ఎక్కడ సినిమా చేసినా కథే ముఖ్యం. అలాంటి కథలు వస్తే బాలీవుడ్ లో కూడా నా సినిమాలు ఉంటాయి.
ప్రస్తుతం రాజమౌళి గారి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్నా. బాలీవుడ్ లో అదే నా కం బ్యాక్ మూవీ అని రాంచరణ్ తెలిపాడు. ఇక సైరా చిత్రంలో తాను ఎలాంటి రోల్ పోషించలేదని, తాను కేవలం నిర్మాతని మాత్రమే అని రాంచరణ్ తెలిపాడు. దిగ్గజ నటులంతా ముందుకు రావడం వల్లే ఈ భారీ ప్రాజెక్ట్ సాధ్యమైందని రాంచరణ్ తెలిపాడు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 20, 2019, 6:12 PM IST