పూనేలో రామ్ చరణ్ ఆగ్రహం, వెనుక అసలు విషయం
ఈ షూటింగ్ లో పాల్గొనడానికి ముంబయ్ వెళ్లి, అక్కణ్ణుంచి చరణ్ పూణె వెళ్లారు. అక్కడ రామ్ చరణ్ ఇరవై రోజులు పాటు రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. అయితే రామ్ చరణ్ తో ఇక్కడ తీసే సీన్స్ ఆయనలో విశ్వరూపం చూపెట్టబోతున్నాయి. ఆవేశంతో ఊగిపోయి, ఫైట్ లో దిగపోయే ఎపిసోడ్ అని తెలుస్తోంది. ఈ మేరకు ఓ యాక్షన్ బ్లాక్ ని షూటింగ్ మొదలెట్టారట. ఈ బ్లాక్ చాలా ఇంటెన్స్ గా ఉంటోందిట.
రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మాతగా ఓ భారీ ప్యాన్ ఇండియా మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా పుణేలో ప్రారంభమైంది. ఈ షూటింగ్ లో పాల్గొనడానికి ముంబయ్ వెళ్లి, అక్కణ్ణుంచి చరణ్ పూణె వెళ్లారు. అక్కడ రామ్ చరణ్ ఇరవై రోజులు పాటు రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. అయితే రామ్ చరణ్ తో ఇక్కడ తీసే సీన్స్ ఆయనలో విశ్వరూపం చూపెట్టబోతున్నాయి. ఆవేశంతో ఊగిపోయి, ఫైట్ లో దిగపోయే ఎపిసోడ్ అని తెలుస్తోంది. ఈ మేరకు ఓ యాక్షన్ బ్లాక్ ని షూటింగ్ మొదలెట్టారట. ఈ బ్లాక్ చాలా ఇంటెన్స్ గా ఉంటోందిట. ఈ సీన్స్ లో రామ్ చరణ్ ఆగ్రహం చూసినవారు ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నిర్ణయానికి వచ్చేసారట. అయితే చిత్రం ఏమిటంటే ఈ బ్లాక్ పూర్తవగానే సాంగ్ షూటింగ్.
రామ్చరణ్–కియారా అద్వానీ పాల్గొనగా ఓ పాట షూటింగ్ ను ప్లాన్ చేశారట. ఈ పాటను పది పాటు చిత్రీకరించనున్నారని భోగట్టా. శంకర్ సినిమాల్లో పాటలు ఎంత రిచ్గా ఉంటాయో తెలిసిందే. ఈ పాట కోసం పుణేలో భారీ సెట్స్ తయారు చేయించారని టాక్. ఈ సినిమా కథ పూర్తిగా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో సాగనుంది. అలాగే సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒఖటి బ్యూరోక్రాట్ రోల్. మరొకటి మాస్ తో ఊగిపోయే క్యారక్టర్ అని తెలుస్తోంది. మాస్ క్యారక్టర్ కు సంభందించిన ఫైట్ సీన్ ఇప్పుడు షూట్ చేసిందని తెలుస్తోంది. చిరంజీవి అప్పట్లో చేసిన దొంగమొగుడు, రౌడీ అల్లుడు తరహాలో రెండు పాత్రలు ఉంటాయని అంటున్నారు. ఈ సినిమా మాస్,క్లాస్ కు సరిపడే సీన్స్ తో పాటు,కొన్ని సోషల్ ఎలిమెంట్స్ ని టచ్ చేయబోతున్నారు.
ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం కోసం రామ్ చరణ్ భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడని ఈ వార్త సారాంశం. దాదాపు 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం రామ్ చరణ్ రూ. 80 కోట్ల వరకు పారితోషకంగా అందుకోబోతున్నాడట.
ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా మారడంతో చెర్రీకి అంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ దక్కబోతున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ పీనల్ కోడ్లోని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పలు సెక్షన్లను శంకర్ ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్టు సమాచారం. శ్రీకాంత్, సునీల్ అంజలి, జయరామ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.