Asianet News TeluguAsianet News Telugu

రికార్డ్ ప్రైస్ కు "గేమ్ ఛేంజర్" OTT రైట్స్ అమ్మకం, ఎవరికి,ఎంతకి?!

సినీ లవర్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రాల్లో ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) ఒకటి. రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా దర్శకుడు శంకర్‌ (S Shankar) తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఓటిటి డీల్ క్లోజ్ అయ్యినట్లు వార్తలు వస్తున్నాయి.

Ram Charan #GameChanger post theatrical streaming rights sold for a RECORD price jsp
Author
First Published Sep 28, 2023, 6:24 AM IST


రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా వెలిగిపోతున్న సంగతి తెలిసిందే. RRR మూవీతో వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యిన ఈ  మెగా పవర్ స్టార్ ఈ చిత్రం తర్వాత   చేస్తున్న మూవీ "గేమ్ ఛేంజర్". భారీ చిత్రాలకు కేరాఫ్ అయిన దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం..అంతకు మించి అనే స్దాయిలో రూపొందిస్తున్నాడని వినికిడి.  పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం  ఓటిటి రైట్స్ గురించిన ఓ వార్త బయిటకు వచ్చింది.

 #GameChanger పోస్ట్ థియేటర్ స్ట్రీమింగ్ రైట్స్  ని  Zee5 వారు ₹270 cr కోట్లకు సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇది రికార్డ్ ప్రైస్ అని చెప్పాలి.  అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు. తమిళ సినిమా వర్గాలు, మీడియా నుంచి వస్తున్న వార్త. ఇది నిజమైనా కాకపోయినా,  దిల్ రాజుకు జాక్ పాట్ లాంటి ప్రాజెక్టు అవుతోందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు మొదట అనుకున్న దానికన్నా భారీగా ఖర్చు పెరిగిపోతోందని సమాచారం. నిర్మాత దిల్ రాజు 50వ చిత్రం కావడంతో.. ఖర్చు విషయంలో తగ్గేదే లే అంటున్నారట. ఇక, ఈ చిత్ర క్లైమాక్స్.. ఇప్పటి వరకూ చూడని విధంగా అత్యంత భారీగా ప్లాన్ చేస్తున్నాడట శంకర్. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ మూవీని రిలీజ్ చేయడానికి చూస్తున్నట్టు సమాచారం.

 కియారా అడ్వాణీ  హీరోయిన్ గా చేస్తున్న  ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. కొద్దిమంది ఆర్టిస్ట్ లు  అందుబాటులో లేనందున ఈ సెప్టెంబరు షెడ్యూల్‌ను రద్దు చేశారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అక్టోబరు రెండో వారంలో మళ్లీ షూటింగ్  ప్రారంభమవుతుందని ప్రకటించింది. రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న యాక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో చరణ్‌ భిన్న కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమా విడుదల తేదీ కోసం చరణ్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు చిత్ర బృందం ఆ అప్‌డేట్‌ ఇవ్వలేదు. మరోవైపు, కొన్ని రోజుల క్రితం ఓ పాట లీక్‌కాగా నిర్మాత దిల్‌ రాజు సీరియస్‌ అయిన సంగతి తెలిసిందే. పాటను లీక్‌ చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సినిమాలో ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌, అంజలి, జయరామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తున్నారు. తిరు ఛాయాగ్రాహకుడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios