రామ్ చరణ్ తో సినిమా చేయడం కోసం ఉరకలు వేస్తున్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు.. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. దానికి తగ్గ సన్నాహాలు కూడా చేస్తున్నాడు దర్శఖుడు.  

మెగా పవర్ స్టార్ ప్రస్తుతం ఫ్యామిలీ అకేషన్స్ లో బిజీగా ఉన్నాడు. గత రెండు నెలలుగా షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చిన చరణ్.. తన భార్య ఉపాసన తో టైమ్ ను స్పెండ్ చేశాడు. తాజాగా ఓ ఆడపిల్లకు తడ్రైన మెగా పవర్ స్టార్.. తన కూతురితో ఆడుకుంటూ.. మరికొన్ని రోజులు ఫ్యామిలీకే తన టైమ్ ను కేటాయించేశాడు. ఇక త్వరలో తన పెండింగ్ షూటింగ్ తో పాటు.. కొత్త సినిమా ఓపెనింగ్స్ కూడా చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

ప్రస్తుతం రామ్‌చరణ్‌ శంకర్‌ డైరెక్షన్ లో గేమ్‌చేంజర్‌ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ఎండ్ స్టేజ్ లో ఉంది. చరణ్ ఈనెలలో ఈమూవీ పెండింగ్ షూటింగ్ పై దృష్టి పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అటు చరణ్ ఇచ్చిన గ్యాప్ ను ఉపయోగించుకుని శంకర్ ఇప్పటికే కమల్ హాసన్ తో ఇండియాన్2 మూవీని పరుగులు పెట్టించాడు. ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్టే.. త్వరలో గుమ్మడికాయ కొట్టడానికి రెడీగా ఉన్నారు ఇండియన్2 టీమ్. ఇక ఆతరువాత చరణ్ సినిమాను సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని చూస్తున్నాడట శంకర్. 

ఇక గేమ్ చేంజర్ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, టైటిల్‌ గ్లింప్స్‌ ఎక్కడలేని అంచనాలు పెంచేశాయి. మెగా పవర్ స్టార్ పాన్ ఇండియా అభిమానులంతా ఈసినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. ఇక ఈమూవీ తరువాత రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో సినిమాను అనౌన్స్ చేశాడు. గేమ్ చేంజర్ అయిపోగానే.. అదే ఊపుతో.. ఏమాత్రం గ్యాప్ లేకుండా.. బుచ్చిబాబుతో చేయబోయే సినిమాపై ఫోకస్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు రామ్ చరణ్. ఇక ఇప్పటికే బుచ్చిబాబు.. ఈసినిమాకు కావల్సి పనులు చేసుకుంటున్నాడు. తమ సినిమాకు మ్యూజిక్ చేయాల్సిందిగా రెహమాన్ ను బుచ్చిబాబు ఒప్పించాడట. ఈ పనిమీద చెన్నై వెళ్ళిన బుచ్చి.. పనిలో పనిగా.. రామ్ చరణ్ కు విలన్ ను వెతికే పనిలో పడ్టట్టు తెలుస్తోంది. 

రామ్ చరణ్ కు విలన్ గా ఆర్ సి 16 లో మరో పెద్ద స్టార్‌ను తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. కోలీవుడ్‌ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో విలన్ పాత్ర చేయాల్సిందిగా బుచ్చిబాబు అడిగారట. విజయ్ ఆల్ రెడీ బుచ్చిబాబు డైరెక్షప్ లో నటించాడు. బుచ్చిబాబు డెబ్యూ సినిమా ఉప్పెనలో హీరోయిన్ తండ్రిగా కనిపించిన విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో మరో పవర్‌ ఫుల్‌ విలన్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమా స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. మైత్రీ మూవీ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్లో రూపొందుతుంది. మరి ఈ విషయంలో విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా.. లేదా అనేది తెలియాల్సి ఉంది.