Asianet News TeluguAsianet News Telugu

మెగాస్టార్ ఎంట్రీతో హడావిడి.. అలిగి వెళ్లిపోయిన రకుల్!

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మేనేజర్ల రజతోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. ఇంతకుముందెన్నడూ లేని విధంగా చాలా మంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 
 

rakul upset with megastar chiranjeevi's entry
Author
Hyderabad, First Published Sep 9, 2019, 3:06 PM IST

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మేనేజర్ల రజతోత్సవ కార్యక్రమం ఆదివారం నాడు హైదరాబాద్ లో జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా మంది సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. అంతేకాదు.. చాలా మంది స్టార్ హీరోయిన్లు లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు.

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఓ నాట్య ప్రదర్శన ఇవ్వడానికి కమిట్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ప్రదర్శన తరువాత రకుల్ ప్రీత్ పెర్ఫార్మన్స్ మొదలు కావాల్సివుంది. అయితే అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి రావడంతో హడావిడి మొదలైంది.

ఆ వెంటనే ప్రముఖుల స్పీచ్ కార్యక్రమం మొదలైంది. చిరంజీవిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానించి మాట్లాడించారు. దీంతో రకుల్ ప్రదర్శన ఇవ్వడం కుదరలేదు. ఆ విషయం రకుల్ ని బాధించడంతో ఆమె అలిగి ఆ కార్యక్రమం నుండి వెళ్లిపోయినట్లు సమాచారం.

ఇక రకుల్ కెరీర్ విషయానికొస్తే.. ఇటీవల 'మన్మథుడు 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో తన బోల్డ్ పెర్ఫార్మన్స్ తో షాకిచ్చింది. ప్రస్తుతం తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు లేవు. తమిళంలో మాత్రం ఓ సినిమా కమిటైనట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios